IPL 2025 : పాపం ఆ.. ముగ్గురు, కలిసిరాని వీకెండ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఐపీఎల్ సీజన్ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే 2 జట్లు ప్లేఆఫ్ రేసు నుండి నిష్క్రమించాయి . మిగిలిన 8 జట్లు భీకరంగా పోటీ పడుతున్నాయి. సీజన్ ఎండ్ కి రావడంతో ఫ్యాన్స్ లో ఆసక్తి పెరుగుతుంది. అయితే ఈ సీజన్లో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. సెంచరీలతో పోటీ పడుతున్నారు. ఈ వీకెండ్ లోనూ అదే పోటీ కనిపించింది. కానీ ముగ్గురు యువ ఆటగాళ్లు సెంచరీకి దగ్గరగా వచ్చి వికెట్ కోల్పోయారు. శనివారం చెన్నై వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో చెన్నైయువ ఆటగాడు ఆయుష్ మాత్రే ఆర్సీబీ బౌలర్లను దంచికొట్టాడు. 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 94 పరుగులు చేశాడు. అయితే సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేద్దామనుకున్న ఆయుష్ కు నిరాశే మిగిలింది. లుంగీ ఎన్గిడి బౌలింగ్లో కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి నిరాశగా పెవిలియన్ చేరాడు.
Also Read : Tourist Family Review: ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ రివ్యూ.. మనుషులు అంటేనే మంచోళ్లు!
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
ఆదివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్ లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో కేవలం ఒక పరుగు తేడాతో కేకేఆర్ గెలిచింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ..6 ఫోర్లు, 8 సిక్సర్లతో ఊచకోత కోశాడు. అయితే పరాగ్ 95 పరుగుల వద్ద వికెట్ కోల్పోయి తన కెరీర్లో మొదటి సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక నిన్న ఈవెనింగ్ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ 236 పరుగులు చేసింది. పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ ఆరంభం నుంచే ధాటిగా ఆడటం మొదలుపెట్టాడు. వచ్చిన బంతిని బౌండరీ తరలిస్తూ పరుగుల వరద పారించాడు. 6 ఫోర్లు , 7 సిక్సర్లతో లక్నో ముందు భారీ లక్ష్యాన్ని విధించాడు. 48 బంతులెదుర్కొన్న ప్రభ్సిమ్రాన్ 91 పరుగుల వద్ద నికోలస్ పూరన్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇలా యంగ్ గన్స్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటూ తమ జట్లకు న్యాయం చేస్తున్నారు.
Also Read : Teacher: జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న ప్రభుత్వ టీచర్లు..
- Tags
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!