IPL 2025 : పాపం ఆ.. ముగ్గురు, కలిసిరాని వీకెండ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఐపీఎల్ సీజన్ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే 2 జట్లు ప్లేఆఫ్ రేసు నుండి నిష్క్రమించాయి . మిగిలిన 8 జట్లు భీకరంగా పోటీ పడుతున్నాయి. సీజన్ ఎండ్ కి రావడంతో ఫ్యాన్స్ లో ఆసక్తి పెరుగుతుంది. అయితే ఈ సీజన్లో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. సెంచరీలతో పోటీ పడుతున్నారు. ఈ వీకెండ్ లోనూ అదే పోటీ కనిపించింది. కానీ ముగ్గురు యువ ఆటగాళ్లు సెంచరీకి దగ్గరగా వచ్చి వికెట్ కోల్పోయారు. శనివారం చెన్నై వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో చెన్నైయువ ఆటగాడు ఆయుష్ మాత్రే ఆర్సీబీ బౌలర్లను దంచికొట్టాడు. 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 94 పరుగులు చేశాడు. అయితే సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేద్దామనుకున్న ఆయుష్ కు నిరాశే మిగిలింది. లుంగీ ఎన్గిడి బౌలింగ్లో కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి నిరాశగా పెవిలియన్ చేరాడు.
Also Read : Tourist Family Review: ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ రివ్యూ.. మనుషులు అంటేనే మంచోళ్లు!
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఆదివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్ లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో కేవలం ఒక పరుగు తేడాతో కేకేఆర్ గెలిచింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ..6 ఫోర్లు, 8 సిక్సర్లతో ఊచకోత కోశాడు. అయితే పరాగ్ 95 పరుగుల వద్ద వికెట్ కోల్పోయి తన కెరీర్లో మొదటి సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక నిన్న ఈవెనింగ్ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ 236 పరుగులు చేసింది. పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ ఆరంభం నుంచే ధాటిగా ఆడటం మొదలుపెట్టాడు. వచ్చిన బంతిని బౌండరీ తరలిస్తూ పరుగుల వరద పారించాడు. 6 ఫోర్లు , 7 సిక్సర్లతో లక్నో ముందు భారీ లక్ష్యాన్ని విధించాడు. 48 బంతులెదుర్కొన్న ప్రభ్సిమ్రాన్ 91 పరుగుల వద్ద నికోలస్ పూరన్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇలా యంగ్ గన్స్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటూ తమ జట్లకు న్యాయం చేస్తున్నారు.
Also Read : Teacher: జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న ప్రభుత్వ టీచర్లు..
- Tags
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!