ఐపీఎల్ లో ఢిల్లీ మెరుపులు మెరిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఐపీఎల్ లో తన సత్తా చాటుకుంటోంది. ఆదివారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, భారీ లక్ష్యఛేదనలో కోల్ కతా నైట్ రైడర్స్ 19.4 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌట్ అవడంతో ఢిల్లీకి విజయం దక్కింది.
https://ntvtelugu.com/today-kkr-vs-dc-rr-vs-lsg-analysis/
కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 54, నితీశ్ రాణా 30, ఆండ్రీ రసెల్ 24 పరుగులు చేశారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీసి కోల్ కతాను దెబ్బతీశాడు. కుల్దీప్ ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టాడు. లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఖలీల్ అహ్మద్ 3, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశారు. నేటి రెండో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ముంబయిలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
