NTV Telugu Site icon

ఇంగ్లాండ్ లోనే భారత కోచ్… ఎప్పటివరకంటే..?

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన చివరి టెస్ట్ మ్యాచ్ రద్దు కావడంతో భారత ఆటగాళ్లు అందరు ఐపీఎల్ కోసం యూఏఈ చేరుకుంటున్నారు. కానీ టీం ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు. అయితే టెస్ట్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న నాలుగోవ టెస్ట్ సమయంలో రవిశాస్త్రి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చివరి టెస్ట్ ప్రారంభ సమయంలో మరోకొంత మంది భారత సహాయక సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ అని వచ్చింది. దాంతో ప్రస్తుతం వారంతా అక్కడే ఆగాల్సి వచ్చింది. ఈ బుధవారం వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో నెగెటివ్ వస్తేనే అక్కడి నుండి అందరు ఇండియాకు బయల్దేరతారు. లేదంటే.. మరికొన్ని రోజుల తర్వాత మళ్ళీ అందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు.