IND vs SA: చెన్నై టెస్ట్ మ్యాచ్ లో చరిత్ర సృష్టించిన భారత్ ఓపెనర్..
- టెస్ట్ మ్యాచ్ లో చరిత్ర సృష్టించిన భారత్ ఓపెనర్
- 20 ఏళ్ల పాకిస్థాన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టిన భరత్ ఓపెనర్లు
- ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డ్ను నమోదు చేసిన భారత క్రికెటర్
- ప్రపంచంలో డబుల్ సెంచరీ చేసిన10వ మహిళా క్రికెటర్గా రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shafali Verma Fastest Double Century: చెన్నై చిదంబరం స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత మహిళా క్రికెటర్ ఓపెనర్ బ్యాట్సమెన్ షఫాలీ వర్మ సంచలనం సృష్టించింది. మొదట టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, ఓపెనింగ్ స్మృతి మంధాన, షెఫాలీ వర్మ కలిసి ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తొలి ఓవర్లలో కాస్త జాగ్రత్తగా ఆడిన ఆ ఆ తర్వాత స్పీడ్ పెంచుతూ పరుగులు వర్షం కురిపించారు. వీళ్ళు ఇద్దరు కలిసి తొలి వికెట్ నష్టానికి 292 పరుగుల రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసారు. దీంతో వీరిద్దరూ 20 ఏళ్ల పాకిస్థాన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. ఇంతకు ముందు ఈ రికార్డు పాకిస్థాన్కు చెందిన సాజిదా షా, కిరణ్ బలోచ్ 2004లో వెస్టిండీస్పై వీరిద్దరూ తొలి వికెట్కు 241 పరుగులు జోడించారు. స్మృతి మంధాన(149) 292 పరుగుల వద్ద ఔట్ అయ్యి వెనుదిరిగింది.
Also Read; T20 World Cup 2024: ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లపై రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్..
Also Read
- IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
- Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
- Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
వన్ డౌన్ బ్యాట్సమెన్ గా వచ్చిన శుభా సతీష్ కూడా వెంటనే ఔట్ అయ్యింది. అయినప్పటికీ షఫాలీ ముందుకు సాగుతూ కేవలం 197 బంతుల్లో 23 ఫోర్లు, 8 సిక్స్లతో 205 పరుగులు చేసి పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. వన్డే తరహా బ్యాటింగ్తో 194 బంతుల్లోనే డబుల్ సెంచరీ నమోదు చేసిన షఫాలీ వర్మ.. ఆస్ట్రేలియా బ్యాటర్ అన్నబెల్ సదర్లాండ్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డ్ను అధిగమించింది. ఈ క్రమంలో ప్రపంచంలో 10వ మహిళా క్రికెటర్గా, భారతదేశంలో డబుల్ సెంచరీ చేసిన రెండవ మహిళా క్రికెటర్గా షఫాలీ వర్మ నిలిచింది. ప్రస్తుతం టీమిండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల కోల్పోయి 525 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో హర్మన్ ప్రీత్ 42, రిచా ఘోష్ 43 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తాజావార్తలు
-
Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
-
Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
-
Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
-
Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
-
Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!