Site icon NTV Telugu

IND Vs ENG: రెండో టీ20 కూడా మనదే.. 2-0 తేడాతో సిరీస్ కైవసం

Team India

Team India

అంతర్జాతీయ టీ20ల్లో భారత్ ఖాతాలో మరో సిరీస్ చేరింది. శనివారం నాడు ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో 49 పరుగుల తేడాతో ఆతిధ్య జట్టును టీమిండియా మట్టికరిపించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు భారత బౌలర్ల ధాటికి 17 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌటైంది. భువనేశ్వర్ 3 వికెట్లతో ఇంగ్లండ్ జట్టను గట్టి దెబ్బ కొట్టాడు. మిగతా బౌలర్లలో బుమ్రా, చాహల్ రెండేసి వికెట్లు తీశారు. హర్షల్ పటేల్, హార్డిక్ పాండ్యా తలో వికెట్ తీశారు. కాగా ఇరుజట్ల మధ్య మూడో టీ20 ఆదివారం జరగనుంది.

Read Also: Kapil Dev: కోహ్లీకి కూడా అశ్విన్ లాంటి పరిస్థితే వస్తుంది

Exit mobile version