Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీసీసీఐ సెలక్షన్ కమిటీ అఫ్గానిస్థాన్తో జరగబోయే రాబోయే సిరీస్ల కోసం భారత వన్డే, టెస్టు జట్లను అధికారికంగా ప్రకటించింది. ఇటీవలి కాలంలో వరుసగా క్రికెట్ ఆడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ సిరీస్ నుంచి పూర్తిగా విశ్రాంతి కల్పించారు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కేవలం టీ20 ఫార్మాట్కు మాత్రమే ఫిట్గా ఉన్నాడని, అందుకే అతడిని టెస్టు మ్యాచ్కు పరిగణనలోకి తీసుకోలేదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు.
వన్డే జట్టు విశేషాలు..
మూడు వన్డేల సిరీస్ కోసం ప్రకటించిన 14 మంది సభ్యుల జట్టుకు యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. సీనియర్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ జట్టులో కొనసాగుతున్నారు. అయితే.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్కు ఈ వన్డే జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లు కీపింగ్ బాధ్యతలు చూసుకోనున్నారు. యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే వంటి దేశవాళీ ప్రతిభావంతులకు వన్డే జట్టులో పిలుపు లభించింది.
Also Read
- Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
- Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
- Vaibhav Sooryavanshi: సచిన్ లాంటి ప్రతిభ కానీ.. వైభవ్ సూర్యవంశీపై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు!
- Shubman Gill: కోహ్లీకి గాయం.. గిల్కు ప్లస్ పాయింట్.. విరాట్ను వెనక్కి నెట్టేసిన యంగ్ కెప్టెన్!
వన్డే జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.
టెస్టు జట్టు విశేషాలు..
అఫ్గాన్తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కోసం 15 మందితో కూడిన సరికొత్త జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. వన్డేల మాదిరిగానే టెస్టు జట్టుకు కూడా శుభ్మన్ గిల్కే సారథ్య బాధ్యతలు అప్పగించారు. సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. వన్డేల్లో చోటు కోల్పోయిన రిషభ్ పంత్ టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. యువ సంచలనాలు యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్లకు చోటు దక్కింది. స్పిన్ విభాగంలో కుల్దీప్, సుందర్లతో పాటు మానవ్ సుతార్కు అవకాశం లభించింది. పేస్ బాధ్యతలను సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చూసుకోనున్నారు.
టెస్టు జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!