Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీసీసీఐ సెలక్షన్ కమిటీ అఫ్గానిస్థాన్తో జరగబోయే రాబోయే సిరీస్ల కోసం భారత వన్డే, టెస్టు జట్లను అధికారికంగా ప్రకటించింది. ఇటీవలి కాలంలో వరుసగా క్రికెట్ ఆడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ సిరీస్ నుంచి పూర్తిగా విశ్రాంతి కల్పించారు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కేవలం టీ20 ఫార్మాట్కు మాత్రమే ఫిట్గా ఉన్నాడని, అందుకే అతడిని టెస్టు మ్యాచ్కు పరిగణనలోకి తీసుకోలేదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు.
వన్డే జట్టు విశేషాలు..
మూడు వన్డేల సిరీస్ కోసం ప్రకటించిన 14 మంది సభ్యుల జట్టుకు యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. సీనియర్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ జట్టులో కొనసాగుతున్నారు. అయితే.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్కు ఈ వన్డే జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లు కీపింగ్ బాధ్యతలు చూసుకోనున్నారు. యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే వంటి దేశవాళీ ప్రతిభావంతులకు వన్డే జట్టులో పిలుపు లభించింది.
Also Read
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
వన్డే జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.
టెస్టు జట్టు విశేషాలు..
అఫ్గాన్తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కోసం 15 మందితో కూడిన సరికొత్త జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. వన్డేల మాదిరిగానే టెస్టు జట్టుకు కూడా శుభ్మన్ గిల్కే సారథ్య బాధ్యతలు అప్పగించారు. సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. వన్డేల్లో చోటు కోల్పోయిన రిషభ్ పంత్ టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. యువ సంచలనాలు యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్లకు చోటు దక్కింది. స్పిన్ విభాగంలో కుల్దీప్, సుందర్లతో పాటు మానవ్ సుతార్కు అవకాశం లభించింది. పేస్ బాధ్యతలను సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చూసుకోనున్నారు.
టెస్టు జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!