India Playing 11 vs Namibia: అభిషేక్, ఇషాన్, సిరాజ్ అవుట్.. ఓపెనర్గా ఊహించని ప్లేయర్!
- నేడు నమీబియాతో భారత్ పోరు
- అభిషేక్, ఇషాన్, సిరాజ్ అవుట్
- ఓపెనర్గా ఊహించని ప్లేయర్
India Playing 11 vs Namibia: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నేడు నమీబియాతో భారత్ తలపడుతుంది. ఢిల్లీ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్లో అమెరికాపై బ్యాటింగ్లో తడబడ్డ టీమిండియా.. నమీబియాపై జోరందుకోవాలని చూస్తోంది. భారత్పై గెలవాలంటే నమీబియాకు కష్టమే అయినా.. కానీ తొలి మ్యాచ్ అనుభవం దృష్ట్యా సూర్య సేన కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. బ్యాటింగ్కు అనుకూలించే ఢిల్లీ పిచ్పై భారత బ్యాటర్లు పరుగుల వరద పారించాలని చుస్తున్నారు. అయితే రెండో మ్యాచ్లో కీలక ప్లేయర్స్ జట్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం.
నమీబియాతో జరగనున్న మ్యాచ్కు ముందు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్పై ఓ కీలక అప్డేట్ బయటకు వచ్చింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ ఆడడం లేదు. ఫుడ్ ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ మంగళవారం ఆస్పత్రిలో చేరాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అభిషేక్ కోలుకుంటున్నాడు. అతడి ఆరోగ్యం మెరుగుపడుతున్నప్పటికీ.. ఈ మ్యాచ్లో మాత్రం ఆడడం లేదు. దాంతో సంజూ శాంసన్ ఈ మ్యాచ్లో ఆడడం ఖాయం అయింది. అయితే ఓపెనర్గా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సుందర్ తిరిగి జట్టులోకి వచ్చి ఈరోజు మ్యాచ్ ఆడనున్నాడు.
Also Read
- BCCI: ఐపీఎల్ ఆటగాళ్ల 'గర్ల్ఫ్రెండ్ కల్చర్'పై బీసీసీఐ సీరియస్.. హార్దిక్, యశస్వి, ఇషాన్, అర్ష్దీప్లకు బిగ్ షాక్!
- PSL 2026 Final: తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర.. కెప్టెన్గా తొలి పీఎస్ఎల్ ట్రోఫీ అందుకున్న బాబర్ ఆజం
- Sai Sudharsan: 13 ఏళ్ల రికార్డు బద్దలు గొట్టిన సాయి సుదర్శన్.. క్రిస్ గేల్ను వెనక్కి నెట్టిన టీమిండియా కుర్రాడు..
- KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
ఇషాన్ కిషన్ గాయం కారణంగా నేటి మ్యాచ్లో ఆడడం అనుమానంగా మారింది. అతని ఫిట్నెస్పై ఇంకా స్పష్టత రాలేదు. అభిషేక్, కిషన్ స్థానాల్లో సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్ ఆడనున్నారు. అలాగే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా తిరిగి ప్లేయింగ్ 11లోకి వచ్చాడు. అతని రీఎంట్రీతో బౌలింగ్ దళం మరింత బలపడనుంది. బుమ్రా ఎంట్రీతో పేసర్ మహ్మద్ సిరాజ్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పుల నేపథ్యంలో నమీబియాతో మ్యాచ్లో టీమిండియా ఎలా ప్రదర్శన చేస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. బుమ్రా, సుందర్ రీఎంట్రీ జట్టుకు కీలక బలం అవుతుందని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.
తుది జట్టు (అంచనా):
సంజూ శాంసన్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్.
తాజావార్తలు
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్డేట్స్ మీకోసం..
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Vijay TVK: “బాక్సాఫీస్ వద్దే కాదు.. బ్యాలెట్ బాక్సుల వద్ద కూడా అతనే ‘తుపాకీ’! విజయ్ సీఎం అవుతాడా?
-
Trisha: పదేళ్లలో సీఎం అవుతానన్న త్రిష వీడియో వైరల్
-
West Bengal Results: తృణమూల్ కోటలో ‘కమల’ వికాసం.. బెంగాల్లో ఘనవిజయం దిశగా బీజేపీ అడుగులు
-
Trisha Political Entry: త్రిష పొలిటికల్ ఎంట్రీ..? విజయ్ మాస్టర్ ప్లాన్ వెనుక నిజం ఏంటి?
-
Sun TV Share Price: తమిళనాడులో విజయ్ సునామీ.. సన్ టీవీ షేర్లు పతనం.. ఎందుకు?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!