India Playing 11 vs Namibia: అభిషేక్, ఇషాన్, సిరాజ్ అవుట్.. ఓపెనర్గా ఊహించని ప్లేయర్!
- నేడు నమీబియాతో భారత్ పోరు
- అభిషేక్, ఇషాన్, సిరాజ్ అవుట్
- ఓపెనర్గా ఊహించని ప్లేయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Playing 11 vs Namibia: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నేడు నమీబియాతో భారత్ తలపడుతుంది. ఢిల్లీ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్లో అమెరికాపై బ్యాటింగ్లో తడబడ్డ టీమిండియా.. నమీబియాపై జోరందుకోవాలని చూస్తోంది. భారత్పై గెలవాలంటే నమీబియాకు కష్టమే అయినా.. కానీ తొలి మ్యాచ్ అనుభవం దృష్ట్యా సూర్య సేన కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. బ్యాటింగ్కు అనుకూలించే ఢిల్లీ పిచ్పై భారత బ్యాటర్లు పరుగుల వరద పారించాలని చుస్తున్నారు. అయితే రెండో మ్యాచ్లో కీలక ప్లేయర్స్ జట్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం.
నమీబియాతో జరగనున్న మ్యాచ్కు ముందు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్పై ఓ కీలక అప్డేట్ బయటకు వచ్చింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ ఆడడం లేదు. ఫుడ్ ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ మంగళవారం ఆస్పత్రిలో చేరాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అభిషేక్ కోలుకుంటున్నాడు. అతడి ఆరోగ్యం మెరుగుపడుతున్నప్పటికీ.. ఈ మ్యాచ్లో మాత్రం ఆడడం లేదు. దాంతో సంజూ శాంసన్ ఈ మ్యాచ్లో ఆడడం ఖాయం అయింది. అయితే ఓపెనర్గా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సుందర్ తిరిగి జట్టులోకి వచ్చి ఈరోజు మ్యాచ్ ఆడనున్నాడు.
Also Read
- Iran vs America: అప్పుడు గులాబీలు.. ఇప్పుడు బాంబులు.. ప్రపంచాన్ని హత్తుకున్న ఈ ఫొటో వెనుక ఉన్న కథ ఇదే!
- IND W vs PAK W: పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలనం చేస్తారా? భారత్ కెప్టెన్ హర్మన్ప్రీత్ షాకింగ్ కామెంట్స్!
- Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
- Rohit Sharma Run Out: రోహిత్ శర్మ ఆశలపై నీళ్లు చల్లిన గిల్.. కెప్టెన్పై హిట్మ్యాన్ ఫైర్!
ఇషాన్ కిషన్ గాయం కారణంగా నేటి మ్యాచ్లో ఆడడం అనుమానంగా మారింది. అతని ఫిట్నెస్పై ఇంకా స్పష్టత రాలేదు. అభిషేక్, కిషన్ స్థానాల్లో సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్ ఆడనున్నారు. అలాగే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా తిరిగి ప్లేయింగ్ 11లోకి వచ్చాడు. అతని రీఎంట్రీతో బౌలింగ్ దళం మరింత బలపడనుంది. బుమ్రా ఎంట్రీతో పేసర్ మహ్మద్ సిరాజ్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పుల నేపథ్యంలో నమీబియాతో మ్యాచ్లో టీమిండియా ఎలా ప్రదర్శన చేస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. బుమ్రా, సుందర్ రీఎంట్రీ జట్టుకు కీలక బలం అవుతుందని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.
తుది జట్టు (అంచనా):
సంజూ శాంసన్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్.
తాజావార్తలు
-
Iran vs America: అప్పుడు గులాబీలు.. ఇప్పుడు బాంబులు.. ప్రపంచాన్ని హత్తుకున్న ఈ ఫొటో వెనుక ఉన్న కథ ఇదే!
-
ASUS Chromebook: మూడు క్రోమ్బుక్లను విడుదల చేసిన ఆసుస్.. స్క్రీన్ను విడదీసి టాబ్లెట్గా మార్చుకోవచ్చు.. తక్కువ ధరకే
-
CJP Protest: నేడు హైదరాబాద్లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ధర్నా.. సోనమ్ వాంగ్చుక్ హాజరు!
-
Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలకు తాత్కాలిక బ్రేక్.. భద్రతా తనిఖీల తర్వాతే అనుమతి!
-
SURIYA : సూర్య 50.. కథ రెడీ చేస్తున్న స్టార్ డైరెక్టర్?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!