India Playing 11 vs Namibia: అభిషేక్, ఇషాన్, సిరాజ్ అవుట్.. ఓపెనర్గా ఊహించని ప్లేయర్!
- నేడు నమీబియాతో భారత్ పోరు
- అభిషేక్, ఇషాన్, సిరాజ్ అవుట్
- ఓపెనర్గా ఊహించని ప్లేయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Playing 11 vs Namibia: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నేడు నమీబియాతో భారత్ తలపడుతుంది. ఢిల్లీ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్లో అమెరికాపై బ్యాటింగ్లో తడబడ్డ టీమిండియా.. నమీబియాపై జోరందుకోవాలని చూస్తోంది. భారత్పై గెలవాలంటే నమీబియాకు కష్టమే అయినా.. కానీ తొలి మ్యాచ్ అనుభవం దృష్ట్యా సూర్య సేన కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. బ్యాటింగ్కు అనుకూలించే ఢిల్లీ పిచ్పై భారత బ్యాటర్లు పరుగుల వరద పారించాలని చుస్తున్నారు. అయితే రెండో మ్యాచ్లో కీలక ప్లేయర్స్ జట్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం.
నమీబియాతో జరగనున్న మ్యాచ్కు ముందు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్పై ఓ కీలక అప్డేట్ బయటకు వచ్చింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ ఆడడం లేదు. ఫుడ్ ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ మంగళవారం ఆస్పత్రిలో చేరాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అభిషేక్ కోలుకుంటున్నాడు. అతడి ఆరోగ్యం మెరుగుపడుతున్నప్పటికీ.. ఈ మ్యాచ్లో మాత్రం ఆడడం లేదు. దాంతో సంజూ శాంసన్ ఈ మ్యాచ్లో ఆడడం ఖాయం అయింది. అయితే ఓపెనర్గా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సుందర్ తిరిగి జట్టులోకి వచ్చి ఈరోజు మ్యాచ్ ఆడనున్నాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
- Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్పై ఘన విజయం..
ఇషాన్ కిషన్ గాయం కారణంగా నేటి మ్యాచ్లో ఆడడం అనుమానంగా మారింది. అతని ఫిట్నెస్పై ఇంకా స్పష్టత రాలేదు. అభిషేక్, కిషన్ స్థానాల్లో సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్ ఆడనున్నారు. అలాగే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా తిరిగి ప్లేయింగ్ 11లోకి వచ్చాడు. అతని రీఎంట్రీతో బౌలింగ్ దళం మరింత బలపడనుంది. బుమ్రా ఎంట్రీతో పేసర్ మహ్మద్ సిరాజ్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పుల నేపథ్యంలో నమీబియాతో మ్యాచ్లో టీమిండియా ఎలా ప్రదర్శన చేస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. బుమ్రా, సుందర్ రీఎంట్రీ జట్టుకు కీలక బలం అవుతుందని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.
తుది జట్టు (అంచనా):
సంజూ శాంసన్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్.
తాజావార్తలు
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!