Site icon NTV Telugu

ముగిసిన శ్రీలంక ఇన్నింగ్స్…ఇండియా టార్గెట్‌ ఎంతంటే ?

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులు చేసి… తొమ్మిది వికెట్లు కోల్పోయింది. మొదట ధాటిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక జట్టును టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. ఇక శ్రీలంక బ్యాటింగ్ వివరాల్లోకి వస్తే ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో 32 పరుగులు, భానుక 27 పరుగులు, కెప్టెన్ శనక 39 పరుగులు చేసి శ్రీలంక జట్టును ఆదుకున్నారు. శ్రీలంక జట్టులో మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. అటు టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్, చాహర్, చాహల్ చెరో రెండు వికెట్లు తీసి శ్రీలంకను కట్టడి చేశారు. ఒక టీమిండియా గెలవాలంటే 50 ఓవర్లలో 263 పరుగులు చేయాల్సి ఉంది.

Exit mobile version