Site icon NTV Telugu

Common Wealth Games 2022: టేబుల్ టెన్నిస్‌లో అద్భుత విజయం.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం

Table Tennis

Table Tennis

Common Wealth Games 2022: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్ హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు తొలి పతకం వచ్చింది. మంగళవారం జరిగిన ఫైనల్‌లో పురుషుల టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్‌లో సింగపూర్‌తో జరిగిన ఆటలో 3-1 తేడాతో భారత్ స్వర్ణాన్ని సాధించింది. అద్భుత ప్రదర్శన చేసిన భారత జట్టు ఫైనల్‌లోనూ శుభారంభం చేసింది. డబుల్స్ జోడీ సత్యన్ జ్ఞానశేఖరన్ , హర్మీత్ దేశాయ్ తమ మ్యాచ్‌లో గెలిచి భారత్‌కు ఆధిక్యాన్ని అందించారు. ప్రస్తుతం జరుగుతున్న గేమ్స్‌లో భారత్‌కు ఇది ఐదో స్వర్ణం. ఆ ఈవెంట్‌లో సత్యన్‌ స్టార్‌గా నిలిచాడు. దీంతో ఇప్పటివరకు భారత్‌ మొత్తం 11 పతకాలు సాధించింది. అందులో ఐదు బంగారు పతకాలు కాగా, 3 రజతం, 3 కాంస్యాలు ఉన్నాయి.

CWG 2022: లాన్‌బౌల్స్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన మహిళల జట్టు గురించి తెలుసా?

2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఇదే ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. మళ్లీ ఇప్పుడు బంగారు పతకాన్ని సాధించింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో నైజీరియాను ఓడించింది.

Exit mobile version