NTV Telugu Site icon

భారత్-శ్రీలంక రెండో టీ20 వాయిదా…

నేడు భారత్-శ్రీలంక మధ్య జరగాల్సిన టీ20 మ్యాచ్ కు కరోనా ఆటంకం కలిగించింది. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో లంకలో పర్యటిస్తున్న యువ భారత జట్టులో ఆల్ కృనాల్ పాండ్యాకు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో నేటి మ్యాచ్ ను వాయిదా వేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈరోజు చేసినా కరోనా పరీక్షలో బీసీసీఐ మెడికల్ బృందం కృనాల్ కరోనా బారిన పడినట్లు అలాగే అతనికి 8 మంది సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించింది. దాంతో ఈరోజు జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ ని రేపటికి అంటే జులై 28కి వాయిదా వేశారు అధికారులు. కానీ 29న జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ కి సంబంధించి ఎటువంటి మార్పులు చేయలేదు. అంటే రెండు రోజులు వరుసగా మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక ఈ మూడు పొట్టి మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే భారత్ 1-0 తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.