IND vs NZ: న్యూజిలాండ్తో మొదటి వన్డే.. బరిలోకి శ్రేయస్ అయ్యర్, తుది టీమ్ ఇదే!
- నేటి నుంచే భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్
- వడోదరలో మధ్యాహ్నం 1.30కు తొలి మ్యాచ్ ఆరంభం
- బరిలోకి శ్రేయస్ అయ్యర్, తుది టీమ్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ నేటి నుంచి ఆరంభం కానుంది. ఆదివారం మధ్యాహ్నం 1.30 నుంచి వడోదరలో తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. 2024లో సొంతగడ్డపై టీమిండియాను వైట్వాష్ చేసిన కివీస్.. ఇప్పుడు మరలా భారత పర్యటనకు వచ్చింది. మరోసారి టీమిండియాపై సత్తాచాటాలని కివీస్ టీమ్ భావిస్తోంది. గత పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ చూస్తోంది. రెండు టీమ్స్ బలంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయం. న్యూజిలాండ్తో మొదటి వన్డే నేపథ్యంలో భారత్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూద్దాం.
ఫామ్ లేమితో టీ20 జట్టులో చోటు కోల్పోయిన శుభ్మన్ గిల్ వన్డేలలో కెప్టెన్గా ఉన్నాడు. రోహిత్ శర్మతో కలిసి గిల్ ఇన్నింగ్స్ను ఆరంభించనున్నాడు. ఈ సిరీస్లో రాణించడం అత్యంత కీలకం. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో రాణించిన రోహిత్, విరాట్ కోహ్లీలు జోరు కొనసాగించాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. పొట్ట గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్కు ఈ సిరీస్ ఎంతో కీలకం. వన్డేలో రాణిస్తే తిలక్ వర్మ స్థానంలో టీ20లు ఆడే అవకాశం వస్తుంది. ఐదవ స్థానంలో కేఎల్ రాహుల్ ఆడనున్నాడు. కీపింగ్ బాధ్యతలు కూడా అతడే నిర్వర్తిస్తాడు.
Also Read
- IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
- Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
- CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయనున్నారు. కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలను మోయనున్నాడు. సుందర్, జడేజాలు స్పిన్ బాధ్యతలను పంచుకోనున్నారు. జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేడు. కాబట్టి మహమ్మద్ సిరాజ్ పేస్ దళాన్ని నడిపించనున్నాడు. అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాలు పేస్ బౌలింగ్ పంచుకోనున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో ఫిట్నెస్, ఫామ్ను చాటుకున్న శ్రేయస్ అయ్యర్.. ఈ సిరీస్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. ప్రస్తుతం అందరి దృష్టి శ్రేయస్పైనే ఉంది. రో-కో మెరుపులు చూసేందుకు కూడా ఫాన్స్ ఆతృతగా ఉన్నారు. పంత్ సహా యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, నితీష్ కుమార్ రెడ్డి కూడా అవకాశం కోసం వేచి ఉండాల్సి ఉంటుంది.
భారత్ జట్టు (అంచనా):
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!