IND vs NZ: న్యూజిలాండ్తో మొదటి వన్డే.. బరిలోకి శ్రేయస్ అయ్యర్, తుది టీమ్ ఇదే!
- నేటి నుంచే భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్
- వడోదరలో మధ్యాహ్నం 1.30కు తొలి మ్యాచ్ ఆరంభం
- బరిలోకి శ్రేయస్ అయ్యర్, తుది టీమ్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ నేటి నుంచి ఆరంభం కానుంది. ఆదివారం మధ్యాహ్నం 1.30 నుంచి వడోదరలో తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. 2024లో సొంతగడ్డపై టీమిండియాను వైట్వాష్ చేసిన కివీస్.. ఇప్పుడు మరలా భారత పర్యటనకు వచ్చింది. మరోసారి టీమిండియాపై సత్తాచాటాలని కివీస్ టీమ్ భావిస్తోంది. గత పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ చూస్తోంది. రెండు టీమ్స్ బలంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయం. న్యూజిలాండ్తో మొదటి వన్డే నేపథ్యంలో భారత్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూద్దాం.
ఫామ్ లేమితో టీ20 జట్టులో చోటు కోల్పోయిన శుభ్మన్ గిల్ వన్డేలలో కెప్టెన్గా ఉన్నాడు. రోహిత్ శర్మతో కలిసి గిల్ ఇన్నింగ్స్ను ఆరంభించనున్నాడు. ఈ సిరీస్లో రాణించడం అత్యంత కీలకం. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో రాణించిన రోహిత్, విరాట్ కోహ్లీలు జోరు కొనసాగించాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. పొట్ట గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్కు ఈ సిరీస్ ఎంతో కీలకం. వన్డేలో రాణిస్తే తిలక్ వర్మ స్థానంలో టీ20లు ఆడే అవకాశం వస్తుంది. ఐదవ స్థానంలో కేఎల్ రాహుల్ ఆడనున్నాడు. కీపింగ్ బాధ్యతలు కూడా అతడే నిర్వర్తిస్తాడు.
Also Read
- IPL 2027: ఈ సారి ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి లక్నో సూపర్ జెయింట్స్.. ఎవరూ ఊహించని కెప్టెన్..
- Team India-BCCI: టీమిండియాలో పెరుగుతున్న గాయాల బెడద.. బీసీసీఐ కీలక నిర్ణయం!
- Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
- Aaqib Nabi: బుమ్రా ఔట్.. టీమిండియాలోకి కొత్త పేసర్ 'ఆకిబ్ నబీ' ఎంట్రీ..!
వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయనున్నారు. కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలను మోయనున్నాడు. సుందర్, జడేజాలు స్పిన్ బాధ్యతలను పంచుకోనున్నారు. జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేడు. కాబట్టి మహమ్మద్ సిరాజ్ పేస్ దళాన్ని నడిపించనున్నాడు. అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాలు పేస్ బౌలింగ్ పంచుకోనున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో ఫిట్నెస్, ఫామ్ను చాటుకున్న శ్రేయస్ అయ్యర్.. ఈ సిరీస్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. ప్రస్తుతం అందరి దృష్టి శ్రేయస్పైనే ఉంది. రో-కో మెరుపులు చూసేందుకు కూడా ఫాన్స్ ఆతృతగా ఉన్నారు. పంత్ సహా యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, నితీష్ కుమార్ రెడ్డి కూడా అవకాశం కోసం వేచి ఉండాల్సి ఉంటుంది.
భారత్ జట్టు (అంచనా):
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
తాజావార్తలు
-
Amazon Sale: అమేజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ సేల్’లో అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్లపై ఏకంగా రూ.10 వేలు తగ్గింపు..
-
SS Rajamouli: తన సినిమాల్లో బెస్ట్ మూవీ.. పర్సనల్ ఫేవరెట్ ఏదో చెప్పిన రాజమౌళి..
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
IPL 2027: ఈ సారి ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి లక్నో సూపర్ జెయింట్స్.. ఎవరూ ఊహించని కెప్టెన్..
-
NTR: త్వరలోనే సెట్స్లోకి ఎన్టీఆర్.. అప్పటివరకు ‘డ్రాగన్’ టీమ్ ఫుల్ బిజీ!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!