England Playing XI vs India: ఇంగ్లండ్, భారత్ మధ్య ఈరోజు ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆరంభం కానుంది. యూకేలోని చెస్టర్ లీ స్ట్రీట్లో రాత్రి 10 గంటలకు మొదటి టీ20 ఆరంభం కానుంది. తొలి టీ20కి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తమ తుది జట్టును ప్రకటించింది. హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని జట్టులో స్టార్ ఆటగాళ్లకు చోటు కల్పించినప్పటికీ.. అభిమానులను ఆశ్చర్యపరుస్తూ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్కు విశ్రాంతి ఇచ్చింది. అలాగే సీనియర్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
భారత్పై బలమైన జట్టుతోనే బరిలోకి దిగుతున్న ఇంగ్లండ్.. సిరీస్ను విజయంతో ఆరంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంగ్లండ్ జట్టులో ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, జాకబ్ బెతెల్, టామ్ బాంటన్లతో బ్యాటింగ్ బలంగా ఉంది. సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్ లాంటి ఆల్రౌండర్లు ఉన్నారు. సాకిబ్ మహ్మూద్, ల్యూక్ వుడ్లు బంతితో మాయ చేయగలరు. సీనియర్లు, జూనియర్ల కలయికతో ఇంగ్లండ్ జట్టు బలంగా ఉంది. అయితే పేసర్ జోఫ్రా ఆర్చర్, స్పిన్నర్ ఆదిల్ రషీద్ జట్టులో లేకపోవడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.
ఇంగ్లండ్ ప్లేయింగ్ XI:
ఫిల్ సాల్ట్
జోస్ బట్లర్
హ్యారీ బ్రూక్ (కెప్టెన్)
జాకబ్ బెతెల్
టామ్ బాంటన్
సామ్ కరన్
విల్ జాక్స్
లియామ్ డాసన్
సాకిబ్ మహ్మూద్
ఆదిల్ రషీద్
ల్యూక్ వుడ్
భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ షెడ్యూల్:
జూలై 1: తొలి టీ20 – చెస్టర్-లీ-స్ట్రీట్
జూలై 4: రెండో టీ20 – మాంచెస్టర్
జూలై 7: మూడో టీ20 – నాటింగ్హామ్
జూలై 9: నాలుగో టీ20 – బ్రిస్టల్
జూలై 11: ఐదో టీ20 – సౌతాంప్టన్

