NTV Telugu Site icon

నెట్స్ లో బౌలింగ్ చేస్తున్న పాండ్య…

ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ యొక్క భారత జట్టు ఎంపికలో మొదటి నుండి చర్చలకు దారి తీస్తుంది ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య. అయితే గత రెండు ఐపీఎల్ సిజ్ఞలలో బౌలింగ్ చేయలేక… ఫిట్నెస్ కారణాలతో ఇబ్బంది పడుతున్న పాండ్య భారత జట్టు ఈ టోర్నీలో ఆడిన మొదటి మ్యాచ్ లో ఆడాడు. కానీ ఆ మ్యాచ్ లో భుజం గాయం కారణంగా తర్వాత ఫిల్డింగ్ చేయలేదు. అయితే ఆ గాయం పెద్దది ఏమి కాదు అని బీసీసీఐ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా పాండ్య నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దాంతో అతను వచ్చే ఆదివారం భారత్ న్యూజిలాండ్ తో ఆడనున్న రెండో మ్యాచ్ లో బరిలోకి దిగుతాడు… అలాగే ఆ మ్యాచ్ లో బౌలింగ్ కూడా చేస్తాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇక కెప్టెన్ కోహ్లీ కూడా పాండ్య ఈ టోర్నీలో ఏదో ఒక స్టేజ్ లో బౌలింగ్ చేస్తాడు అని చెప్పినవిషయం తెలిసిందే.