Radhika Yadav: టెన్నిస్ ప్లేయర్ను తండ్రి ఎందుకు చంపాడు? విచారణలో ఏం తేలిందంటే..!
- టెన్నిస్ ప్లేయర్ (25) రాధిక యాదవ్ హత్య
- విచారణలో కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలోని గురుగ్రామ్లో టెన్నిస్ ప్లేయర్ రాధిక యాదవ్ (25) హత్యకు గురైంది. సొంత కన్నతండ్రి దీపక్ యాదవ్ చేతిలోనే అత్యంత దారుణంగా చంపబడింది. కని పెంచి పెద్ద చేసిన చేతులతోనే బిడ్డ ప్రాణాలు తీశాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అంతగా తండ్రి చంపడానికి గల కారణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిందితుడు దీపక్ యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: The Paradise : ది ప్యారడైజ్కి డబుల్ ట్రీట్..
Also Read
- Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
- IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
- Team India: 142 ఏళ్ల తర్వాత సరికొత్త చరిత్ర.. టీమ్ ఇండియా అరుదైన రికార్డు..
- Ben Stokes: ఒత్తిడిలోనే రిటైర్మెంట్? 'అతడిని బయటకు పంపండి' అంటూ స్టోక్స్ సంచలన పోస్ట్..
రాధిక యాదవ్ రాష్ట్ర స్థాయిలో ప్రసిద్ధ టెన్నిస్ క్రీడాకారిణి. పలు టోర్నమెంట్స్లో మెడల్స్ సాధించి కుటుంబానికి, ఆ ప్రాంతానికి కీర్తిని తెచ్చిపెట్టింది. అయితే గురువారం ఉదయం వంట గదిలో రాధిక అల్పాహారం సిద్ధం చేస్తుండగా వెనుక నుంచి లైసెన్స్ తుపాకీతో తండ్రి దీపక్ యాదవ్ ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. మూడు బుల్లెట్లు లోపలికి దూసుకెళ్లడంతో ప్రాణాలు వదిలింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలిని పరిశీలించి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: iPhone 16 Pro: ఐఫోన్ లవర్స్కు క్రేజీ ఆఫర్.. ఐఫోన్ 16 ప్రో పై ఏకంగా రూ.19,701 భారీ డిస్కౌంట్..!
అయితే ఈ హత్యకు ఏడాది క్రితమే బీజం పడినట్లుగా తెలుస్తోంది. ఏడాది క్రితం రాధిక ఒక మ్యూజిక్ వీడియో చేసింది. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనంతరం బంధువుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాకుండా సొంతూరుకి వెళ్లినప్పుడల్లా.. కూతురు ఆదాయంతో బతుకుతున్నావని హేళన చేయడం రుచించలేదు. దీనిపై చాలా రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అలాగే మ్యూజిక్ వీడియోపై కూడా రభస నడుస్తోంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడంతో ఆమె ఆర్థికంగా బలపడింది. ఆమె ఎవరినీ లెక్క చేయకుండా స్వేచ్ఛగా విహరిస్తోంది. ఈ వ్యవహారం తండ్రిని ఎంతగానో బాధపెట్టింది. దీంతో కుమార్తెను చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. గురువారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో వంటగదిలో రాధిక టిఫిన్ రెడీ చేస్తుండగా తండ్రి వెనుక నుంచి ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. విచారణంలో కుమార్తెను తానే చంపినట్లుగా దీపక్ యాదవ్ (49) అంగీకరించాడు.
పోలీసుల కథనం ప్రకారం.. కుమార్తె సంపాదనపై ఆధారపడి జీవించినందుకు స్వస్థలమైన వజీరాబాద్లోని గ్రామస్తులు పదే పదే ఎగతాళి చేశారని, ఆమె నడిపే టెన్నిస్ అకాడమీని మూసివేయాలని ఆమెను చాలాసార్లు కోరానని.. అందుకు అంగీకరించకపోవడంతో చంపేసినట్లుగా అధికారులకు దీపక్ చెప్పాడు.
కాల్పుల శబ్దం విని వెంటనే ఆమె మామ కుల్దీప్ యాదవ్ రూమ్లోకి వచ్చేటప్పటికీ విగతజీవిగా పడి ఉన్న రాధికను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే రాధిక కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నారు. కానీ ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. పోలీసుల విచారణలో ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!