NTV Telugu Site icon

భారత్-ఇంగ్లాండ్ : మొదట బ్యాటింగ్ చేయనున్న టీం ఇండియా

నేడు భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఓవల్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ లో టాస్ గెలిచినా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బౌలింగ్ ఎంచుకోవడంతో టీం ఇండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే గత మూడు టెస్టులలో ఒక్క మార్పు లేకుండా ఆదోని కోహ్లీ సేన ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. పేసర్లు షమీ. ఇషాంత్ స్థానంలో శార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు. ఇక ఈ మ్యాచ్ లో అశ్విన్ ఆడుతాడు అనుకున్నవారికి అందరికి నిరాశే ఎదురైంది. ఒకే ఒక్క స్పిన్నర్ గా ఈ మ్యాచ్ లో కూడా జడేజానే తుది జట్టులో ఉన్నాడు.

భారత జట్టు : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (c), అజింక్య రహానే, రిషబ్ పంత్ (wk), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఇంగ్లాండ్ జట్టు : రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలన్, జో రూట్ (c), ఓలీ పోప్, జానీ బెయిర్‌స్టో (wk), మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రెయిగ్ ఓవర్టన్, ఓలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్