Site icon NTV Telugu

IPL 2022: రాణించిన పృథ్వీ షా.. అద్భుతం చేసిన లక్నో బౌలర్లు

Sports 1

Sports 1

ఐపీఎల్‌లో భాగంగా డీవై పాటిల్ స్టేడియం వేదికగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్వల్ప స్కోరు చేసింది. ఆరంభంలో అదరగొట్టిన ఆ జట్టు బ్యాటర్లు ఆ తర్వాత నెమ్మదిగా ఆడటంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు. దీంతో 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఢిల్లీ జట్టు సాధించిన స్కోరులో ఓపెనర్ పృథ్వీ షా ఒక్కడే 61 పరుగులు చేశాడు. కెప్టెన్ పంత్ 39 నాటౌట్, సర్ఫరాజ్ ఖాన్ 36 నాటౌట్ ధాటిగా ఆడలేకపోయారు. లక్నో బౌలర్ రవి బిష్ణోయ్ 4 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ బ్యాటర్లు షాట్లు ఆడలేకపోయారు. ముఖ్యంగా చివరి మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాకపోవడం విశేషం.

https://ntvtelugu.com/bumrah-and-nitish-rana-gets-warning-from-math-reffery-in-ipl-2022/

Exit mobile version