Subscribers Want Free Content On OTTs: ఓటీటీలో ఉచిత కంటెంట్ వైపే ప్రేక్షకుల మొగ్గు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Subscribers Want Free Content On OTTs: మన దేశంలో ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం వెండి తెర కన్నా బుల్లి తెర కన్నా ఓటీటీకే ఎక్కువ ఓటేస్తున్నారు. దీంతో గతేడాది కన్నా ఈ సంవత్సరం ఓటీటీ ఆడియెన్స్ సంఖ్య 20 శాతం పెరిగింది. ఇండియాలో ప్రస్తుతం ఓటీటీ వీక్షకుల సంఖ్య 42 పాయింట్ మూడు 8 కోట్లుగా నమోదైంది. ఈ విషయాన్ని ‘‘ది ఆర్మాక్స్ ఓటీటీ ఆడియెన్స్ రిపోర్ట్’’ వెల్లడించింది. ఈ ఏడాదికి సంబంధించి జులై-సెప్టెంబర్ నివేదిక లేటెస్ట్గా రిలీజ్ అయింది. రిపోర్ట్ రూపొందించేందుకు ఈ సంస్థ దేశవ్యాప్తంగా 13 వేల 500 మంది నుంచి సమాచారం సేకరించారు.
గడచిన నెల రోజుల్లో ఒక్క సారైనా ఒక డిజిటల్ వీడియో చూసినవారిని ఓటీటీ ఆడియెన్స్గా పరిగణనలోకి తీసుకుంటారు. పోయినేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 7 కోట్ల మందికి పైగా కొత్త వీక్షకులు ఈ కేటగిరీలో చేరారు. కిందటేడాది ఓటీటీ విస్తృతి 25 పాయింట్ 3 శాతం ఉండగా ఈసారి 30 శాతానికి వృద్ధి చెందింది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు, మెట్రో నగరాలు, మినీ మెట్రో సిటీలు.. ఇలా అన్ని చోట్లా ఓటీటీలో వీడియోలు వీక్షించేవారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. ఈ మార్కెట్లలో ఇప్పటికే 70 శాతానికి పైగా ప్రజలు డిజిటల్ వీడియోలనే చూస్తున్నారు.
Also Read
- Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
- Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
- ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
- Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
read also: Vodafone Idea is Losing Customers: ప్రతి నెలా భారీగా తగ్గిపోతున్న ‘వీఐ’ కస్టమర్ల సంఖ్య
భారతదేశంలో ఇప్పుడు 42 కోట్ల మందికి పైగా ఉన్న మొత్తం ఓటీటీ ఆడియెన్స్ను ఈ ఆర్మాక్స్ రిపోర్టు నాలుగు సెగ్మెంట్లుగా విభజించింది. ఎస్వీఓడీ డైరెక్ట్ అనే ఫస్ట్ కేటగిరీలోని ప్రేక్షకులు ఏదైనా ఒక స్ట్రీమింగ్ సర్వీస్కి నేరుగా డబ్బు చెల్లించి వీడియోలు చూస్తున్నారు. ఎస్వీఓడీ ఇన్డైరెక్ట్ అనే సెకండ్ సెగ్మెంట్లోని వీక్షకులు డబ్బులు కట్టకుండానే కంటెంట్ వీక్షిస్తున్నారు. ఈ మేరకు వాళ్లు కుటుంబ సభ్యుల మెంబర్షిప్ ద్వారా లేదా టెలికం బండిల్స్ ద్వారా ఈ సర్వీసును ఎంజాయ్ చేస్తున్నారు.
‘ఏవీఓడీ ప్లస్’ అనే థర్డ్ సెక్షన్లో జనాలు ఉచిత స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో వీడియోలు తిలకిస్తున్నారు. ఇందులో యూట్యూబ్తోపాటు కనీసం ఒక్క ఓటీటీ వేదికైనా ఉంటుంది. ‘‘యూట్యూబ్ ప్లస్ సోషల్ మీడియో ఓన్లీ’’ అనే నాలుగో సెగ్మెంట్లో కస్టమర్లు వీడియోలను కేవలం యూట్యూబ్లో లేదా యూట్యూబ్తోపాటు సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నారు. మొత్తం ఓటీటీ యూజర్లలో పెయిడ్ కేటగిరీ పర్సంటేజీ.. అంటే.. ఎస్వీఓడీ డైరెక్ట్ అండ్ ఇన్డైరెక్ట్ పర్సంటేజీ కలిపి 30కి పైగానే ఉంది. ఫ్రీగా కంటెంట్ చూసేవారి సంఖ్య మాత్రం అత్యధికంగా 69 శాతానికి పైగా ఉండటం విశేషం.
2021తో పోల్చితే 2022లో ఓటీటీ యూనివర్స్లో యూట్యూబ్ ప్లస్ సోషల్ మీడియా ఓన్లీ అనే ఫోర్త్ సెగ్మెంట్లో వీడియోలు వీక్షించేవారి సంఖ్య హయ్యస్ట్ రెండున్నర కోట్లు పెరిగింది. టోటల్గా గ్రోత్ పర్సంటేజీ కూడా ఈ సెక్షన్లోనే ఎక్కువగా నమోదు కావటం గమనించాల్సిన విషయం. ఇదిలాఉండగా ఆర్మాక్స్ సంస్థ ఈ ఓటీటీ ఆడియెన్స్ రిపోర్ట్ను 2021వ సంవత్సరం నుంచి పబ్లిష్ చేస్తోంది. డిజిటల్ వీడియో మార్కెట్ పెరుగుదలను ప్రైమరీ డేటా రీసెర్చ్ ఆధారంగా లెక్కిస్తోంది. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్, ఇండస్ట్రీ ఎస్టిమేట్స్ తదితర సెకండరీ డేటా మీద ఆధారపడకుండా నివేదికను జెన్యూన్గా రూపొందిస్తోంది.
తాజావార్తలు
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!