భరణి బహుముఖ ప్రజ్ఞ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూలై 14న తనికెళ్ళ భరణి పుట్టినరోజు)
“ఆట కదరా శివా… ఆట కద కేశవా…” అంటూ ఈ తరం వారికి మరచిపోయిన మన సంప్రదాయంలోని మహాత్యాన్ని బోధిస్తున్నారు నటదర్శక రచయిత తనికెళ్ళ భరణి. ‘భూగోళమంతా ఓ నాటకరంగం… మనమంతా పాత్రధారులం…’ అన్నారు శాస్త్రకారులు. నిజమే! మనమంతా కనిపించని శక్తి చేతిలో ఆటబొమ్మలం. ఆ ఆట ఆడించేవాడు శివుడు అంటారు. ఆడించేది కేశవుడూ అనీ చెబుతారు. రచన, నటన రెండు కళ్ళుగా సాగుతున్న తనికెళ్ళ భరణి ఆడించేవారు ‘శివకేశవులు’ అంటూ రాగం తీస్తారు. శివుడు, కేశవుడు రూపభేదం- అది మానవ భ్రాంతి. ఉన్నది ఒక్కడే! హరియైనా, హరుడైనా ఒక్కటే అన్నదే భరణి భావన. భరణి కలం పలికించగా, ఆయనే గానం చేసిన “ఆట కదరా శివా” విశేషాదరణ పొందుతోంది. భరణి రచనలో రూపొందిన మరో ఆధ్యాత్మిక జ్యోతి “శభాషురా శంకరా” కూడా అలరిస్తోంది. ఇక తన కలం బలంతో భరణి సాగిన తీరు, నటనతో రాణించిన వైనం సైతం భావితరాలకు స్ఫూర్తి కలిగిస్తున్నాయి.
బాల్యం నుంచీ మాతృభాష తెలుగుపై భరణికి మమకారం మెండు. అలాగే చదువుకొనే రోజుల్లోనే హిందీ, ఆంగ్ల భాషల్లోనూ పట్టు సాధించారు. దొరికిందల్లా చదివారు. ఊహకొచ్చిందల్లా రాసేశారు. అదే ఆయనను రచయితగా మార్చింది. ప్రముఖ నటుడు రాళ్ళపల్లి పరిచయంతో మరింతగా చదివారు. రాళ్ళపల్లి సూచనతో చెన్నై చేరి ‘కంచు కవచం’తో మాటల రచయితగా మారిపోయారు. ఆ తరువాత నుంచీ మాటలు పలికిస్తూ ఆకట్టుకుంటూ సాగారు. వంశీ ‘లేడీస్ టైలర్’కు ‘జ’ భాష నేర్పించడమే కాదు, అందులో తానూ ఓ పాత్రలో చొరబడిపోయారు భరణి. అలా ఆరంభమైన రచన, నటనతో భరణి భలేగా సాగారు. తరువాత రాయడానికే సమయం సరిపోనంతగా నటనలో బిజీ అయిపోయారు. ఇంకేముంది, వందలాది పాత్రల్లోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసి మెప్పించారు. ‘సముద్రం’లో ప్రతినాయకునిగా ప్రదర్శించిన నటనకు ‘బెస్ట్ విలన్’గా నంది లభించింది. ‘నువ్వు-నేను’లో కనబరచిన అభినయానికి ‘బెస్ట్ కేరెక్టర్ యాక్టర్’గానూ నంది వరించింది. భరణి ధరించిన పలు పాత్రల్లో ఆయన కనిపించలేదు, ఆ పాత్రలే మన ముందు కదలాడాయి.
Also Read
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
- Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
- Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
- ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
రచన, నటనతోనే కాదు మెగాఫోన్ పట్టినా, అందులోనూ తన మార్కు ప్రదర్శించారు భరణి. “సిరా, కీ, బ్లూ క్రాస్, ద లాస్ట్ ఫార్మర్” వంటి లఘు చిత్రాలకు దర్శకత్వం వహించాక భరణి ‘మిథునం’ కథా చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీరమణ రాసిన ‘మిథునం’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో భరణి మార్కు మాటలు ఆయనకు ఉత్తమ సంభాషణల రచయితగానూ నందిని అందించాయి. కేవలం రెండు పాత్రలతోనే రూపొందిన ‘మిథునం’లోనూ మన సంస్కృతీ సంప్రదాయాలను ముచ్చటించిన తీరు జనాన్ని భలేగా ఆకట్టుకుంది. తన బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తూ భలేగా సాగుతున్న భరణి మరిన్ని మంచి పాత్రలతోనూ, తనదైన రచనలతోనూ మనలను పలకరిస్తారని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
-
Yashpal Sharma: 1983 ప్రపంచకప్లో అసలైన సూపర్మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
ట్రెండింగ్
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!