IT Employees: మరిన్ని రోజులు ఉండం.. మళ్లీ ఇటువైపు రాం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Employees: వచ్చే మూడేళ్లలో ఏకంగా 22 లక్షల మంది ఐటీ ప్రొఫెషనల్స్ జాబులు వదులుకోనున్నారని ఓ రిపోర్ట్ వెల్లడించింది. దీన్నిబట్టి మన దేశంలోని ఐటీ-బీపీఎం రంగంలో ఉద్యోగ క్షీణత ఏ రేంజులో ఉండనుందో అర్థంచేసుకోవచ్చు. దీంతోపాటు.. 57 శాతం మంది ఐటీ నిపుణులు మళ్లీ ఈ సర్వీసుల సెక్టారులోకి రావాలనుకోవట్లేదని కూడా ఆ నివేదిక పేర్కొంది. ‘ట్యాలెంట్ ఎక్సోడస్ రిపోర్ట్’ పేరుతో ఈ నివేదికను ‘‘టీమ్ లీజ్ డిజిటల్’’ అనే సంస్థ రూపొందించింది. దీని ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో 49 శాతంగానే ఉన్న కాంట్రాక్ట్ సిబ్బంది తొలగింపు 2023 ఆర్థిక సంవత్సరంలో 55 శాతానికి చేరుకోనుందని అంచనా వేసింది.
Also Read
- Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
- Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
- ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
- Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
క్యాండేట్ మార్కెట్లో సెంటిమెంటుకు సంబంధించి భారీ అపోహ నెలకొంది. శాలరీ పెంచితే ఉద్యోగి పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని, జాబ్ శాటిసిఫ్యాక్షన్కి బూస్ట్ మాదిరిగా పనిచేస్తుందనుకోవటం సరికాదు. ఈ మధ్య కొన్ని సంస్థలు శాలరీలు పెంచుతున్నా ఉద్యోగ వలసలను ఆపలేకపోతున్నాయని, 2025 నాటికి 22 లక్షల మంది కొలువులకు గుడ్ బై చెబుతారని అంచనా. ‘‘ఇండియన్ ఐటీ సెక్టార్ గత దశాబ్ద కాలంలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. 15.5 శాతం గ్రోత్ను నమోదు చేసింది. తద్వారా 227 బిలియన్ డాలర్ల టర్నోవర్కి చేరింది. ఫలితంగా గత ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఐదున్నర లక్షల మందికి ఉద్యోగాలను కల్పించింది.
ఈ స్థాయిలో అభివృద్ధి చెందాలంటే మామూలుగైతే పదేళ్లకు పైగా టైమ్ పడుతుంది. అలాంటిది ఆ లోపే లక్ష్యం సాకారమైందంటే ఎంత శరవేగంగా సాగిందో అర్థంచేసుకోవచ్చు’’ అని టీమ్ లీజ్ డిజిటల్ సీఈఓ సునిల్ అన్నారు. ఐటీ రంగంలో నియామకాల ప్రక్రియకు కరోనా మహమ్మారి ఆటంకం కలిగించటంతో అప్పటివరకు కొనసాగిన ఈ పాజిటివ్ ట్రెండ్ కాస్తా రివర్స్ అయింది. బిజినెస్-క్రిటికల్ ట్యాలెంట్ పీపుల్ వెళ్లిపోకుండా ఆపటం కష్టసాధ్యమైంది. దీనికితోడు కొవిడ్ తర్వాతి రెండేళ్లలో ఐటీ హైరింగ్ చైన్లో చాలా మార్పులు వచ్చాయి అని సునిల్ చెప్పారు.
కొత్త ఉద్యోగాల్లోకి వెళ్లేవారు శాలరీ హైక్తోపాటు ఇతర బెనెఫిట్స్ కూడా చూసుకుంటారు. వర్క్ మరియు లైఫ్కి సంబంధించి ఎంప్లాయీస్ ఫీలింగ్స్లో చెప్పుకోదగ్గ మార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యజమానులు తమ ఇంటర్నల్ పాలసీలతోపాటు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ పట్ల సైతం పునరాలోచన చేయాల్సిన అవసరం నెలకొందని టీమ్ లీజ్ డిజిటల్ సీఈఓ సునిల్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల అవసరాలు, ప్రాధాన్యతలు మారాయి. ఫ్లెక్సిబిలిటీ, కెరీర్ గ్రోత్, ఎంప్లాయ్ వ్యాల్యూ పొజిషన్ తదితర అంశాల ఆధారంగా వాళ్లు తమ కెరీర్ని రీ-ఎవాల్యుయేషన్ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కన్నా మంచిది దొరికితే దీన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతున్నారు. అన్నింటికీ మించి ఉద్యోగంలో సౌకర్యానికే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ గణాంకాలను బట్టి వెల్లడవుతోంది. సంస్థల వ్యూహాత్మక నియామక ప్రణాళికలు తమ ఉద్యోగుల కోణంలో, వాళ్ల అభివృద్ధి లక్ష్యంగా ఉండాలి. అప్పుడు మాత్రమే సరైన ఉద్యోగుల ఎంపిక జరుగుతుంది. పని పట్ల విలువ, గౌరవం ఉన్నోళ్లు దొరుకుతారు. అలాంటివాళ్ల వల్లే కంపెనీ ఔట్పుట్ పెరుగుతుంది. దాని ద్వారా మరో పది మందికి ప్రయోజనం కలుగుతుంది.
2021లో ఐటీ సేవల రంగంలో క్షీణత వల్లే నవతరం సంస్థలు తమ వర్క్ ఫోర్సును పెంచుకుంటున్నాయి. ఇప్పుడు చేసే ఉద్యోగంలో బెటర్ కంపెన్సేషన్ మరియు బెనెఫిట్స్ లోపించటం వల్లే ట్యాలెంటెడ్ పీపుల్ కొత్త కొలువులోకి వెళ్లిపోతున్నారని స్టడీలో పాల్గొన్న దాదాపు 50 శాతం మంది అన్నారు. కెరీర్ గ్రోత్ లేకపోవటం వల్లే స్వస్తి చెబుతున్నామని 25 శాతం మంది తెలిపారు. అత్యధిక శాలరీలు తీసుకునే బెస్ట్ ఎంప్లాయీస్ స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకొని అర్ధంతరంగా వెళ్లిపోతే ఆయా సంస్థలకు టర్నోవర్ పరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ట్యాలెంట్ ఎక్సోడస్ రిపోర్ట్ పేర్కొంది.
తాజావార్తలు
-
Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!