Sangareddy BJP Leaders : ఆ పార్టీ నేతల సంగతేంటి..? చొక్కాలు ఎందుకు చింపుకుంటున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కడ పార్టీ ఉన్నదే అంతంత. నేతల మధ్య కుమ్ములాటలు మాత్రం ఎక్కువే. ఫ్లెక్సీల్లో ఫొటో లేదని ఒకరు.. పార్టీ జెండా ఎగరేసే విషయంలో మరొకరు గల్లా పట్టుకుంటారు.. చొక్కలు చించుకుంటారు. ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టుది మరోదారి అన్నట్టు ఉందట నేతల తీరు.
సంగారెడ్డి బీజేపీలో వర్గపోరు గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిదన్నది పార్టీ నేతల మాట. ఎన్నికల్లో సత్తా చాటలేరు కానీ.. పార్టీలోని ఇతర నేతలపై పైచెయ్యి సాధించేందుకు మాత్రం ఉడుంపట్టే పడతారనే టాక్ ఉంది. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బీజేపీ పరిస్థితి దిగజారుతున్నా స్థానిక నాయకులకు ఎలాంటి ఫికర్ లేదనే అభిప్రాయం రాష్ట్ర నేతల్లోనే ఉందట. 2014లో బీజేపీకి 18వేల ఓట్లు వస్తే.. 2018 ఎలక్షన్లు వచ్చే సరికి 6వేల ఓట్లతో సరిపెట్టుకున్నారు కమలనాథులు. ఈ గణాంకాలతో లోకల్ లీడర్స్కు ఎలాంటి చీకు చింత లేదని.. కలవరమంతా పైవాళ్లకే అని ఇక్కడి బీజేపీ కేడర్ చెవులు కొరుక్కుంటోంది.
Also Read
సంగారెడ్డి బీజేపీ ఇంఛార్జ్గా రాజేశ్వరరావు దేశ్పాండే ఉన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రెడ్డి కొనసాగుతున్నారు. వీరిద్దరికీ అస్సలు పడటం లేదు. ఇటీవలే దయాకర్రెడ్డి అనే మరో నేత స్పీడ్ పెంచారట. కొత్త వ్యక్తి రాక వెనక జిల్లా అధ్యక్షుడి కుట్ర ఉందనేది ఇంఛార్జ్ అనుమానం. ఈ సందేహాలు రోజు రోజుకీ బలపడుతున్నాయే తప్ప.. సమస్య తీవ్రతను పట్టించుకుని.. పరిష్కరించిన రాష్ట్ర నేతలే లేరట. చివరకు రాష్ట్ర నేతలు భయపడిందే జరిగింది. ప్రజాగోస-బీజేపీ భరోసాయాత్ర సాక్షిగా రోడ్డెక్కి ఘర్షణ పడ్డాయి రెండు వర్గాలు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సమక్షంలోనే గల్లాలు పట్టుకున్నారు నేతలు.
సదాశివపేటలోని మద్దికుంటలో బీజేపీ బైక్ ర్యాలీ నడుస్తుండగా ఇంచార్జ్ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలలో తమ నేత ఫొటో లేదని వాదులాడుకున్నారు కూడా. అది కాస్తా చినికి చినికి గాలి వానగా మారి.. ఒకరినొకరు తోసుకున్నారు. చొక్కాలు చిరిగిపోయాయి. అరిచి గీ పెట్టినా.. ఎవరూ తన మాట వినకపోవడంతో రాంచంద్రరావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత రోజు జరిగిన బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలోనూ రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. సంగారెడ్డిలో బీజేపీ బలోపేతానికి ఫోకస్ పెట్టకుండా.. ఈ తన్నులాటలేంటో కమలదళానికి అర్ధం కావడం లేదట.
సంగారెడ్డిలో గలాటా చేస్తున్న నేతలకు రాష్ట్రస్థాయిలో గట్టి లాబీయింగే ఉందట. హైదరాబాద్ నుంచి ఉన్న ఆశీసుల కారణంగానే ఎవరూ వెనక్కి తగ్గడం లేదనే చర్చ సాగుతోంది. ఒకవైపు రాష్ట్రంలో అధికారంలోకి రావాలని.. పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ తెలంగాణ సారథి పాదయాత్ర చేస్తుంటే.. ఇక్కడి నేతలు మాత్రం ఆధిపత్యపోరాటానికి ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఇక్కడి పరిణామాలతో విసుగుచెందిన కేడర్.. కార్యక్రమాలకు రావడమే మానేసిందట. హైదరాబాద్కు చేరువలో ఉన్న నియోజకవర్గం కావడంతో సంగారెడ్డి బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర నేతలు కలవర పడుతున్నారట. ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ వాళ్లు ఎంట్రీ ఇస్తే.. ఎవరికి సర్ది చెబుతారు? మాట వినని వారిపై చర్యలు తీసుకుంటారా? అనే సందేహాలు ఉన్నాయట.
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!