OTR: కాంగ్రెస్ సర్కార్ స్పెషల్ డ్రైవ్.. తెలంగాణ శాఖల్లో భారీ లీకులు బట్టబయలు..
- ఫేక్ లెక్కలు తీసేందుకు స్పెషల్ డ్రైవ్
- మైనింగ్లో లీకులు అరికట్టేసరికి 22శాతం ఆదాయం పెరుగుదల
- అన్ని డిపార్ట్మెంట్స్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల లెక్కలు బయటికి
- 15వేల మంది ఉద్యోగులు మిస్ అయినట్టు నివేదిక
- ఆ 15వేల మంది ఎవరు? నకిలీ ఉద్యోగులా?
- జీతాలు డ్రా చేసి వేరే ఎవరో నొక్కేస్తున్నారా?
- పదేళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగుల చిట్టా అధికారుల చేతిలో
- నొక్కుడులో ఉన్నది అధికారులా? రాజకీయ నాయకులా?
- అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సీఎం టేబుల్ మీదికి రిపోర్ట్?
- ఆ 15వేల మంది వెనక ఉన్నది ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఉన్న లీకులకు సీలేసే స్పెషల్ డ్రైవ్ చేపట్టింది కాంగ్రెస్ సర్కార్. ఒక్కో డిపార్ట్మెంట్లో అనధికారికంగా పక్కదారి పడుతున్న ప్రభుత్వ సొమ్ముకు అడ్డుకట్ట వేసే పని మొదలైంది.ఇప్పటికే మైనింగ్ డిపార్ట్మెంట్ లీక్స్కు ఎమ్సీల్ వేసేశారట. దాంతో ఈ ఏడాది ఏకంగా 22 శాతం ఆదాయం పెరిగిందని చెబుతున్నారు. ఇక ఆ ఇన్స్పిరేషన్తో ఎక్కడెక్కడ ప్రభుత్వ ధనం వృధా అవుతోందో లెక్కలు తీసి పూర్తిగా కట్టడి చేయాలని నిర్ణయించారు ప్రభుత్వ పెద్దలు. అందులో భాగంగానే… అన్ని శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్యను తేల్చాలని డిసైడ్ అయ్యింది సర్కార్.
READ ALSO: Vidadala Rajini: ఎమ్మెల్యే కుమారుడే డ్రగ్స్ తీసుకుంటూ దొరకటం సిగ్గుచేటు!
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
డిసెంబర్ 31 వరకు పూర్తి లెక్కలు తీస్తే… ఆ వివరాలు చూసి అంతా షాక్ తిన్నట్టు తెలుస్తోంది. దాదాపు 15వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు మిస్ అయినట్టు తెలుస్తోంది. వాళ్ళు ఎవ్వరూ అస్సలు ఆధార్ కార్డులు ఇవ్వలేదని సమాచారం. ఇన్నాళ్ళు వీళ్ళ పేరుతో జీతాలైతే డ్రా చేస్తున్నారుగానీ… గవర్నమెంట్ దగ్గర పూర్తి వివరాలు లేవు. ఈ డిటైల్స్ చూసి స్వయంగా ఆర్థిక శాఖ అధికారులే కంగుతిన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో…. ఇంతకీ ఆ 15 వేల మంది ఉద్యోగులు ఎవరు..? నిజంగానే ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తుంటే… ఎందుకు సమాచారం ఇవ్వలేదు..? వాళ్ళ పేరుతో వేరే ఎవరైనా డబ్బులు డ్రా చేసి నొక్కేస్తున్నారా..? అనే చర్చ మొదలైంది సచివాలయవర్గాల్లో. గత పదేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు సేకరించిన క్రమంలో ఈ అక్రమ చిట్టా బయటపడిందట. దాంతో.. కాంట్రాక్టు ఉద్యోగుల పేరుతో… డబ్బులు నొక్కింది ఎవరు..? అందులో అధికారుల పాత్ర ఉందా..? లేక రాజకీయ నాయకుల పాత్ర ఉందా అన్నది తేల్చే విషయంలో ప్రభుత్వ పెద్దలు సీరియస్గా ఉన్నట్టు సమాచారం.
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ముగిసిన వెంటనే ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందించేందుకు అధికార వర్గాలు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టు ఉద్యోగుల పేరుతో దోపిడీ జరిగిందని, అన్నిటినీ బయటకు తీస్తామని గతంలో ప్రకటన కూడా చేశారు సీఎం రేవంత్రెడ్డి. దానిపై ఆడిట్ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన 15 వేల మంది ఉద్యోగుల సంగతి ఏంటి..? వెనకాల ఉన్నది ఎవరు..!? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ విభాగాల్లో… 15 వేల ఉద్యోగాలంటే అదేం చిన్న విషయం కాదు. అందుకే దీనిపై సర్కార్ ఏం చేయబోతుంది..!? లెక్కలు సరిచేస్తారా..? వెనక ఉన్న వాళ్ళని బయటికి లాగుతారా అంటూ ఆసక్తిగా చూస్తున్నాయి తెలంగాణ రాజకీయవర్గాలు.
READ ALSO: YouTube: యూట్యూబ్లో కొందరికి కోట్లు.. మరికొందరికి జీరో! అసలు కారణం ఇదే..
తాజావార్తలు
-
Prateek Yadav: అఖిలేష్ యాదవ్ తమ్మడు ‘ప్రతీక్ యాదవ్’ మృతి..!
-
Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!
-
MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
-
Rahul Ramakrishna : థియేటర్లు ఖాళీగా ఉండటానికి అసలు కారణం ఇదే..
-
Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!