Srikakulam YCP Politics : శ్రీకాకుళం వైసీపీలో వాడీ వేడిగా గ్రూపు రాజకీయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srikakulam YCP Politics : పేరు గోప్ప ఊరు దిబ్బ..! ఆ జిల్లాలో అధికారపార్టీ ఎమ్మెల్యేల తీరు అలాగే ఉందట. బయట పెద్ద నేతలుగా చెలామణి అవుతున్నా.. నియోజకవర్గాల్లో ఈగల మోత తప్పడం లేదట. అన్నిచోట్లా హేళన రాజకీయాలే. మూడేళ్ల తర్వాత మారుతున్న రాజకీయ రంగులు ఎవరి కొంప ముంచుతాయో తెలియడం లేదట. అది ఏ జిల్లానో ఈ స్టోరీలో చూద్దాం.
ఇదే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. 2019 ఎన్నికల్లో జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 చోట్ల వైసీపీ జెండా ఎగిరింది. ప్రస్తుతం కేబినెట్లో ఇద్దరు మంత్రులతోపాటు అసెంబ్లీ స్పీకర్ కూడా ఇక్కడి వారే. ఈ మూడేళ్ల కాలంలో జిల్లా వైసీపీ నేతలకు మరిన్ని కీలక పదవులు లభించాయి. అధికారపార్టీ ఇచ్చిన ప్రాధాన్యంతో నేతలంతా ఫుల్ హ్యాపీస్. వచ్చే ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేస్తారని పార్టీ పెద్దలు ఆశిస్తుంటే.. ఎమ్మెల్యేల తీరు మాత్రం రివర్స్. నియోజకవర్గాల్లో పొలిటికల్ సీన్లూ మారిపోతున్నాయ్. నిన్న మొన్నటి వరకు ఎలక్షన్ టు ఎలక్షన్ రాజకీయాలు నడిస్తే.. ఇప్పుడు ప్రతి చిన్న అంశాన్నీ పెద్ద సమస్యగా చిత్రీకరిస్తున్నారు. అందులోనే రాజకీయ లబ్ధి ఆశించే వర్గాలు పెరిగిపోయాయి.
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న సభ్యత్వ నమోదు వ్యవహారం
శ్రీకాకుళం అసెంబ్లీని మినహాయిస్తే.. వైసీపీ గెలిచిన మిగిలిన నియోజకవర్గాల్లో వందశాతం గ్రూపు రాజకీయాలు వాడీవేడీగా ఉన్నాయి. అసంతృప్తులను.. అసమ్మతి నేతలను సెట్ చేయడంలో ఎమ్మెల్యేలు.. అక్కడి పార్టీ నేతలు చేతులు ఎత్తేయడం కేడర్ను కలవరపెడుతోందట. గత ఎన్నికల్లో వైసీపీకి చిక్కని ఇచ్ఛాపురం, టెక్కలిలో అయితే వైసీపీ మూడు గ్రూపులుగా చీలిపోయింది. స్పీకర్ తమ్మినేని సీతారాం గెలిచిన ఆమదాలవలసలోనూ మూడు గ్రూపులు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఉన్నచోట వారితో విభేదిస్తూ.. రోడ్డెక్కి మాట్లాడేస్తున్నారు నాయకులు. ఎచ్చెర్ల, పాతపట్నం, నరసన్నపేట, పలాసల్లో ఏకంగా ప్రెస్మీట్లే పెట్టేశారు. కీలకమైన నాలుగు నియోజకవర్గాల్లో వర్గపోరు తారాస్థాయికి చేరడం.. ఒకరినొకరు హేళనగా మాట్లాడుకోవడంతో పార్టీ బలహీన పడుతోందని అధిష్ఠానం గుర్తించిందట.
మంత్రి సీదిరి అప్పలరాజు గెలిచిన పలాస, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఎమ్మెల్యేగా ఉన్న నరసన్నపేటలో రెబల్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. ఇంత వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ రెండుచోట్లా.. పార్టీ ప్లీనరీల వేదికగా అసంతృప్తి బయటపడింది. పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాటలను పార్టీ నేతలు లెక్క చేయడం లేదట. అక్కడ పార్టీ కార్యక్రమాలు బోసిపోతున్నాయని పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పార్టీ నేత పేరాడ తిలక్లకు పడటం లేదు. మధ్యలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి టెక్కలిలో పాగా వేయడానికి చూస్తున్నారు. పాతపట్నం, నరసన్నపేట, పలాసల్లో వైసీపీ తాజా పరిస్థితి.. ఎమ్మెల్యేల పనితీరులపై ఒక నివేదిక పార్టీ పెద్దలకు చేరిందట. ఆ సర్వే ఆధారంగా చర్యలు ఉంటాయని చర్చ జరుగుతోంది.
నియోజకవర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని.. వర్గపోరును.. తీవ్రత.. అతి తీవ్రత అని లెక్కలు కట్టడానికి.. కొలమానాలు కూడా సరిపోవడం లేదని కొందరు వైసీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, ఇసుక తదితర ఆదాయ మార్గాలు.. విభేదాలకు దారితీసి.. పార్టీ నేతల మధ్య గ్యాప్ తీసుకొచ్చాయట. లెక్కలు తేడా కొట్టి ఒకరినొకరు శత్రువులుగా చూసుకుంటున్నారట. ఎన్నికల మూడ్ క్రమేపీ బలపడుతున్న తరుణంలో నియోజకవర్గాల వారీగా వైసీపీలో నెలకొన్న విభేదాలను సెట్ చేయకపోతే మొదటికే మోసం రావొచ్చని హెచ్చరిస్తున్నారట. మా ఎమ్మెల్యే ఓడిపోతే ఓడిపోవచ్చు.. రాష్ట్రంలో మళ్లీ వైసీపీ సర్కారే వస్తుందని అసమ్మతి నేతలు చేస్తున్న ప్రకటనలు గుబులు రేపుతున్నాయట. మరి.. ఈ సమస్య శ్రుతిమించకుండా పార్టీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!