మదర్ డెయిరీలో ‘గుత్తా’ శకం ముగిసిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు 3 దశాబ్దాలుగా ఆ డెయిరీలో ఆ సీనియర్ నేత చెప్పిందే వేదం.. శాసనం..! పెత్తనమంతా ఆయన ఫ్యామిలీదే…! పార్టీలు మారినా.. డెయిరీలో పట్టు సడలకుండా చూసుకున్నారు ఆ నాయకుడు. కానీ.. జిల్లా రాజకీయాల్లో వచ్చిన ఆధిపత్యపోరు.. సీటుకే ఎసరు పెట్టింది. ఇక ఆయన శకం ముగిసినట్టేనని చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఎవరాయన? ఏమా కథ?
మదర్ డెయిరీతో గుత్తా బంధం తెగినట్టేనా?
Also Read
నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మదర్ డెయిరీ కూడా కీలకం. 30 ఏళ్లుగా డెయిరీపై గుత్తా సుఖేందర్రెడ్డిదే పెత్తనం. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ పట్టు కోల్పోకుండా చూసుకున్నారు గుత్తా. ఇప్పుడు మాత్రం ఆ ఫ్యామిలీ పెత్తనానికి బ్రేక్ పడింది. మదర్ డెయిరీ నుంచి గుత్తా కుటుంబం బయటకు రావాల్సిన పరిస్థితిని కల్పించారు ప్రత్యర్థులు. దానిపైనే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతోంది.
ఈ దఫా గుత్తా ఫ్యామిలీని పోటీ చేయనివ్వలేదా?
నల్లగొండ రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి సుఖేందర్రెడ్డి దాదాపు ఐదుసార్లు ఛైర్మన్గా ఉంటే.. ఆయన సొదరుడు జితేందర్రెడ్డి పదమూడేళ్లపాటు ఛైర్మన్గా ఉన్నారు. మధ్యలో ఒకసారి బొందుగుల నరసింహారెడ్డి ఛైర్మన్గా పనిచేశారు. ఈ మార్పు కూడా గుత్తా అనుమతితో జరిగిందేనని చెబుతారు. ప్రస్తుతం ఎన్నికల ముంగిట నిలిచిన మదర్ డెయిరీలో గుత్తా ఫ్యామిలీని పోటీ చేయనివ్వలేదని టాక్. ఛైర్మన్ రేస్ నుంచి సుఖేందర్రెడ్డితోపాటు ఆయన సోదరుడు తప్పుకోక తప్పని పరిస్థితి. ఇప్పటికే డైరెక్టర్ ఎన్నికలకు సంబంధించి జోరుగా రాజకీయం సాగుతోంది. డెయిరీ పరిధిలోని సొసైటీ ఛైర్మన్లను క్యాంపులకు తరలించడంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ అధికారపార్టీ వర్గాల్లో ఎక్కువగా ఉంది.
గుత్తా చేతిలో ప్రస్తుతం ఎలాంటి పదవి లేదు?
మదర్ డెయిరీ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను మంత్రి జగదీశ్వర్రెడ్డికి అప్పగించారు. దీంతో ఇప్పుడు సూర్యాపేట ప్రాంతానికి చెందిన వ్యక్తినే మదర్ డెయిరీ ఛైర్మన్గా ఎన్నుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. అందువల్లే గుత్తా కుటుంబాన్ని పోటీలో నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని సమాచారం. మొత్తంగా 30 ఏళ్లుగా మదర్ డెయిరీపై గుత్తా ఫ్యామిలీకి ఉన్న పట్టు సడలినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నిన్నటి వరకు శాసనమండలి ఛైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్రెడ్డికి ఇప్పుడు ఆ పదవి కూడా లేదు. మరోసారి ఎమ్మెల్సీ పదవి వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడు తమ కుటుంబం అధీనంలో ఉన్న మదర్ డెయిరీ ఛైర్మన్ గిరి కూడా పోవడంతో గుత్తా రాజకీయ భవిష్యత్పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయా అన్న చర్చ జోరందుకుంది. మరి.. ఈ సీనియర్ పొలిటీషియన్ ఏం చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!