Rajahmundry YCP Politics : రాజమండ్రి వైసీపీలో వర్గపోరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాకో లీడర్ కావాలి. ఆ చారిత్రక నగరంలోని వైసీపీ శిబిరంలో వినిపిస్తున్న మాట. ఎన్ని ప్రయోగాలు చేసినా అవి వర్కవుట్ కావడం లేదు. పార్టీకి ఉన్న వేవ్ను పట్టుకోవడంలో సక్సెస్ కావడం లేదట. దీంతో చుక్కాని లేక దిగాలు చెందుతున్నాయి శ్రేణులు. అదెక్కడో ఇప్పుడు చూద్దాం.
ఏపీలోని రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం రాజమండ్రి. గత ఎన్నికల్లో ఇక్కడ అర్బన్, రూరల్ సీట్లు వైసీపీ ఖాతాలో పడలేదు. వైసీపీలో బలమైన నాయకులు ఉన్నప్పటికీ .. వారి మధ్య సమన్వయం లేకపోవడంతో ఎన్నికల్లో బోల్తా కొట్టారు లోకల్ లీడర్స్. ఆ ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చినా.. మూడేళ్లుగా రాజమండ్రి వైసీపీలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ నేతల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. ఈసారి ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలిన వైసీపీ అధిష్ఠానం ఆలోచిస్తున్నా.. స్థానిక నేతలకు చీమ కుట్టినట్టు అయినా లేదట.
Also Read
- Off The Record: రూ.50 కోట్ల భూమి కోసం రికార్డులు తారుమారు! తాడిపత్రిలో అధికారులపై వేటు
- Off The Record: భోగాపురం ఎయిర్ పోర్టులో భోజనాల గోల.. లోకల్ లీడర్ల ‘చిలక్కొట్టుడు’ లీలలు
- OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
- OTR : సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖకు చిక్కులు? పదవిపై కత్తి వేలాడుతుందా?
అప్పట్లో ఉభయ గోదావరిజిల్లాల వైసీపీ ఇంఛార్జ్గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి.. రాజమండ్రిలో పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. ఇప్పుడు సుబ్బారెడ్డి ప్లేస్లో ఎంపీ మిధున్రెడ్డి సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు. మిధున్రెడ్డి పలుమార్లు పార్టీ నేతలతో మాట్లాడినా.. లోకల్ లీడర్స్ ఒక పట్టాన లొంగడం లేదట. కలహాలు వీడటం లేదని సమాచారం. రాజమండ్రిలో వైసీపీపి పార్టీ ఆఫీసు లేదు. ఎంపీ మార్గాని భరత్ క్యాంప్ కార్యాలయంలోనే పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఈ మూడేళ్ల కాలంలో రాజమండ్రి కోఆర్డినేటర్లుగా ముగ్గురు మారారు. ఆ ప్రయోగం కూడా సక్సెస్ కాలేదు.
మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాషరావు, APIIC మాజీ ఛైర్మన్ శివరామ సుబ్రమణ్యం, మరో మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వైసీపీ కోఆర్డినేటర్లుగా పనిచేసినా.. వివిధ కారణాలు చెబుతూ తమ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ప్రస్తుతం రాజమండ్రి వైసీపీకి కోఆర్డినేటర్ లేరు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే శ్రీదేవి ఉన్నా.. అదనంగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ను కన్వీనర్గా పెట్టారు. మరి ఒక్క ఇంఛార్జ్ కూడా లేని రాజమండ్రిలో మాత్రం.. నాయకత్వం సమస్య కొలిక్కి రావడం లేదట. రాజమండ్రిలో వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలు ఒక వర్గంగా.. ఎన్నికల ముందు.. పార్టీ అధికారంలోకి వచ్చాక చేరిన నేతలు మరో వర్గంగా కొనసాగుతున్నారు.
వైసీపీ అధిష్ఠానం చేసిన సర్వేలన్నీ రాజమండ్రిలో నెగెటివ్గానే వస్తున్నాయట. ఇప్పటికే మేయర్ ఎన్నికలు బకాయి ఉన్నాయి. మరో 20 నెలల్లో సాధారణ ఎన్నికలు వస్తాయి. అయినప్పటికీ స్థానికంగా నాయకత్వం సమస్య పట్టిపీడిస్తోంది. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అభ్యర్థులు కావాలని ప్రకటన చేసుకోవాల్సిన దుస్థితి ఉందని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. రాజమండ్రిలో ముఠాలను చూశాక నాయకత్వం మీద ఆశ ఉన్నవాళ్లు సైతం భయపడిపోతున్నారట. అందుకే టికెట్ ఆశిస్తున్న వారు ముందుకొచ్చి నోరు విప్పడానికి జంకుతున్నారు. సమయం వచ్చినప్పుడు చూద్దాంలే అని కొందరు.. హైకమాండ్ పిలిస్తే చూద్దామని మరికొందరు సైలెంట్గా ఉండిపోతున్నారట. ఎమ్మెల్యేతోపాటు మేయర్ అభ్యర్థి ఎవరో తేల్చుకోలేకపోతున్నాయి శ్రేణులు. మరి.. వైసీపీ పెద్దలు రాజమండ్రి వైసీపీకి ఎలాంటి చికిత్స చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
-
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
ట్రెండింగ్
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!