OTR: పొంగులేటి, కొమ్మూరు మధ్య సంభాషణ.. ఆయన హార్ట్ అయ్యారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: మున్సిపల్ ఎన్నికల వేళ.. ఆ మంత్రి అన్న మాటలు మాజీ ఎమ్మెల్యేకు మేకుల్లా గుచ్చుకున్నాయా? పార్టీ ఇన్ఛార్జ్తో ఉన్న చనువుకొద్దీ మినిస్టర్ అలా మాట్లాడారా? లేక సీరియస్గానే మనసులో ఉన్నది ఆటోమేటిగ్గా బయటికి వచ్చేసిందా? సోషల్ వీధుల్లో చర్చలు మొదలయ్యాక అంతా సర్దుకున్నారా? ఎవరా ఇద్దరు నాయకులు? అంతలా ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య?
Hyderabad: చీకటి పడితే చాలు.. రేసింగ్లు, స్టంట్లతో భయాందోళనలో వాహనదారులు!
Also Read
వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మధ్య జరిగిన మాటల గురించి ఉమ్మడి జిల్లా పాలిటిక్స్లో హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే.. ఇది బాగా వైరల్ అవుతోంది. కొమ్మూరును ఉద్దేశించి.. పొంగులేటి అన్న మాటలు తీవ్ర కలకలం రేపాయి. ఆ మాటలతో నొచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే.. ఒక దశలో నేను రాజకీయాలు మానేస్తానని అన్నట్టు కూడా జోరుగా ప్రచారం జరిగింది.
ఈ ఘటన జరిగినప్పుడు పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రతినిధి మరొకరు కూడా.. ఇదేదో చినికి చినికి గాలి వానలా మారుతుందేమో అనుకున్నారట. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సరిగా పని చేయలేదని, మున్సిపల్ ఎన్నికల్లో అయినా సీరియస్ గా వర్కవుట్ చేయమని చెప్పే క్రమంలో పొంగులేటి.. కొమ్మూరును ఉద్దేశించి సగం బుర్ర వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. ఆ విషయంలో మంత్రి ఉద్దేశ్యం ఏదైనా… బయటికి మాత్రం వ్యతిరేక సంకేతాలు వెళ్ళాయి. మాజీ ఎమ్మెల్యే డీప్గా హర్టయ్యారని కూడా ప్రచారం ఊపందుకున్న క్రమంలో.. వెంటనే ఆయనే జోక్యం చేసుకుని వాతావరణాన్ని తేలికపరిచారు. తమ మధ్య ఉన్న సాన్నిహిత్యంతోనే మంత్రి పొంగులేటి అలా అన్నారని తాను అనుకున్న వాళ్ళందరికీ బీ ఫామ్స్ అందాయని, నాకేం అసంతృప్తి లేదన్నట్టుగా చెప్పుకొచ్చారాయన.
EV Owners Alert: మీ కారు బ్యాటరీ లైఫ్ పెంచే 7 మ్యాజిక్ టిప్స్ ఇవే.!
ఈ వ్యవహారం టీ కప్పులో తుఫాన్లా ముగిసిపోయినా… కొన్ని డౌట్స్ మాత్రం అలాగే ఉండిపోయాయట. ప్రస్తుతం నాయకులు ఎక్కడ ఏం చేసినా సోషల్ మీడియా ఠక్కున పట్టేస్తోంది. వీడియోలు ట్రెండింగ్లోకి వచ్చేసి ఎవరికి నచ్చిన భాష్యాలు వాళ్ళు చెప్పేస్తున్నారు. నాయకుల మధ్య ఫ్రెండ్షిప్ ఉండవచ్చు, వాళ్లు సరదాగా మాట్లాడుకోవచ్చుగానీ… ఇలా బహిరంగంగా మాట్లాడుకునే క్రమంలో… సోషల్ మీడియాలో ట్రోల్ అవడం మాత్రం పార్టీ నేతలకు కూడా రాంగ్ ఇండికేషన్స్ పంపినట్టు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నలుగురిలో ఉన్నప్పుడు నాయకులు జాగ్రత్తగా ఉండటం బెటర్ అన్న సూచనలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!