Off The Record: విజయవాడ కనకదుర్గ సన్నిధిలో ఏం జరుగుతుంది?
- నిత్యం ఏదొక గొడవతో దుర్గగుడి ఈవో శీనా నాయక్ సతమతం ..
- శ్రీచక్ర అర్చనలో వినియోగించిన పాలలో పురుగులపై భక్తుల ఆందోళన..
- కరెంట్ షాక్ ఘటనతో ఆగ్రహావేశాలు..
- ఆలయ ఐదో అంతస్తుకు నేరుగా కేక్ తీసుకురావడంపై భక్తుల ఫైర్..
- ఈఓ నిర్లక్ష్యం వల్లే వరుస తప్పిదాలని రచ్చ ..
- ఈఓ పాలనా వ్యవహారంపై సీఎం టేబుల్ దగ్గర నివేదిక..
- రాజకీయ రంగు పులుముకున్న దుర్గగుడి పరిణామాలు..
- కూటమి, వైసీపీ మధ్య మాటల యుద్ధం..
- తప్పు ఒకరిది..నిందలు మరొకరికా అని ఈవో ఆవేదన..
- రానున్న కాలంలో సీఎం కీలక నిర్ణయం ఖాయమా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో వరుసగా చోటు చేసుకుంటున్న సున్నిత ఘటనలు ప్రతిరోజు టాక్ ఆఫ్ ది టౌన్గా మారుతున్నాయి. ఆలయ పరిపాలనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఆలయ ఈవో శీనా నాయక్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతిరోజు ఏదొక గొడవతో సతమతం అవుతున్నారు. వరుస వివాదాలు అపచార ఘటనలు, తప్పులు ఎవరు చేసినా ఏం జరిగినా ఆలయ ఈఓను నిన్ను వదల బొమ్మాలి అన్నట్టు ఆయనను వెంటాడుతున్నాయి.
Read Also: Maruthi: హారర్ మూవీస్’లో దెయ్యాన్ని చంపడం ఈజీ.. ఎలాగైనా చంపొచ్చు!
Also Read
పవర్ కట్ వివాదం చల్లారకముందే బ్యాక్ టు బ్యాక్ ఘటనలు ఇంద్రకీలాద్రిపై కలకం రేపుతున్నాయి. శ్రీచక్ర అర్చనలో వినియోగించిన పాలలో పురుగులు కనిపించడం భక్తుల్లో ఆందోళనకు కారణమైంది. అదే సమయంలో ఉచిత ప్రసాదం పంపిణీ కేంద్రం దగ్గర భక్తులకు షాక్ కొట్టిన ఘటన విమర్శలకు దారి తీసింది. అంతేకాదు, ఆలయ ఐదో అంతస్తుకు నేరుగా కేక్ తీసుకురావడం వంటి ఘటనలు కూడా పరిపాలన లోపాలను ఎత్తిచూపాయి. వీటికి కారణం ఎవరైనా, చివరికి ఈ ఇష్యూలన్నీ ఈవో చుట్టే తిరుగుతున్నాయి. ఈవో వైఫల్యమే కారణమని కార్నర్ చేస్తున్నారు. ఇలా వరుస ఘటనలతో ఇంద్రకీలాద్రి పరిపాలనపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా పవర్ కట్ ఘటన విషయంలో పూర్తి బాధ్యత ఈఓపైనే పడిపోయింది. ఈఓ నిర్లక్ష్యం వల్లే అ పొరపాటు జరిగిందన్న చర్చ జరుగుతోంది. ఈఓ సమన్వయం చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని, తప్పంతా ఈఓదే అని ఏకంగా దేవాదాయ శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం శారు. దేవాదాయ కమిషనర్ కూడా ఈఓ తీరును తప్పుపట్టారు.
ఇంకోవైపు ఆలయ అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా బయటపడుతోంది. చైర్మన్ vs ఈఓ, ఈఓ vs దేవాదాయ కమిషనర్ మధ్య అభిప్రాయ భేదాలు పరిపాలనను గందరగోళానికి నెడుతున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ వివాదాలన్నీ ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి వెళ్లినట్టు సమాచారం. ముఖ్యమంతి టేబుల్పైన ఈఓ పాలనా వ్యవహారం, పర్ఫార్మెన్స్ ఇలా ప్రతీది నివేదిక రూపంలో సీఎం దగ్గరకు చేరుతోంది. ప్రభుత్వం దుర్గగుడిలో వరుస వివాదాల నడుమ ఎప్పడు ఏ నిమిషంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు వరుస పరిణామాలు రాజకీయ రంగు పులుముకుంటుండటంతో ప్రతి పక్ష వైసీపీ భగ్గుమంటోంది. దుర్గ గుడిలో వరుస ఘటనలపై హిందూ సంఘాలతో కలిసి కార్యాచరణ సిద్ధం చేసి పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని చెబుతోంది. మరోవైపు ఈ పరిణామాలన్నిటిపై హిందూ సంఘాలు, అమ్మవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యమే ఇలాంటి ఘటనలకు కారణమని ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆలయ ఈఓ శీనా నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసేది ఒకరు… నిందలు మోయాల్సింది మరొకరా అని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈవోగా బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోవడంతో, చివరికి ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేసే పరిస్థితి వస్తోందని నేతలు అంటున్నారు.
తాజావార్తలు
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!