Off The Record: ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు మీద సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారా..?
- ఎంపీ లావు వ్యవహారశైలిపై నియోజకవర్గంలోనే డౌట్స్..
- తాజాగా ఐవీఆర్ఎస్ సర్వేతో మరింత కలకలం..
- పదవుల పంపకాల్లో పాత వాళ్ళని విస్మరిస్తున్నారన్న విమర్శలు..
- పార్టీలో గ్రూప్స్ని ప్రోత్సహిస్తున్నారన్న అభియోగం..
- నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబుతో పొసగడం లేదా?..
- ఎంపీ వర్గానికి చెక్పెట్టే ప్రయత్నాల్లో కొందరు సీనియర్ నేతలు..
- ఎంపీ పనితీరుపై తాజాగా ఐవీఆర్ఎస్ కాల్స్తో అటెన్షన్..
- అధిష్టానానికి వెళ్ళిన ఫిర్యాదులే కారణం అంటున్న కొందరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు వ్యవహారం గురించి ప్రస్తుతం రకరకాల చర్చలు జరుగుతున్నాయి, కొందరికి కొత్త కొత్త డౌట్స్ వస్తున్నాయి. అసలు ఆయన్ని ఏ కోణంలో చూడాలంటూ…పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. పైకి మంచి అనిపిస్తున్నా…. కాస్త లోతుల్లోకి తొంగి చూస్తే… ఎక్కడో ఏదో తేడా కొడుతోందని అనేవాళ్ళ సంఖ్య నియోజకవర్గంలోనే పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లోనే… తాజాగా టీడీపీ అధిష్టానం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించి ఎంపీ పనితీరుకు సంబంధించిన ప్రశ్నలు సంధించడం కలకలం రేపుతోంది. 2019లో తొలిసారి నరసరావుపేట నుంచి వైసీపీ తరపున గెలిచారు లావు. 2024 ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచే బరిలో దిగాలని అనుకున్నా… గుంటూరు పంపాలని నిర్ణయించింది అధిష్టానం. ఆ క్రమంలోనే వైసీపీకి రాజీనామా చేసి కొన్నాళ్ళ తర్వాత టీడీపీ కండువా కప్పుకున్నారాయన. రెండోసారి సైకిల్ గుర్తు మీద నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో అందరూ టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా… మెల్లిగా పదవుల పంపకాల్లో శ్రీకృష్ణదేవరాయులుతో పాటు టీడీపీలో చేరిన వారికి ప్రాధాన్యత లభిస్తోందంటూ వివాదం మొదలైంది. వినుకొండకు చెందిన మక్కెన మల్లిఖార్జునరావుకు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి దక్కడం వెనక ఎంపీ చొరవ ఉందని పార్టీలో ప్రచారం జరిగింది. అలాగే…లావుతో పాటు టీడీపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తికి టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం లభించింది. ఎంపీ పరపతిని గట్టిగా వాడటం వల్లే వాళ్ళకు పదవులు వచ్చాయన్న టాక్ గట్టిగా నడిచింది పల్నాడు టీడీపీలో. అటు లోక్సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఎంపీకి టీడీపీ అధిష్టానం కూడా ప్రాధాన్యం ఇచ్చింది.
అదంతా ఒక ఎత్తయితే…శ్రీకృష్ణ దేవరాయలు పార్టీలో గ్రూప్స్ని ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. ఇదే ఇప్పుడు సమస్యగా మారుతోందట. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన గ్రూపులు ప్రోత్సహించారన్న ఆరోపణలున్నాయి. టీడీపీలో కూడా అదే ట్రెండ్ కొనసాగిస్తున్నారంటూ లోకల్గా పార్టీలో అసహనం వ్యక్తం అవుతోంది. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుతో ఎంపీకి పొసగడం లేదని చెప్పుకుంటున్నారు. ఎంపీతో సన్నిహితంగా ఉంటాడని పేరున్న నర్సరావుపేట జనసేన నేత తరచూ తమనేతను టార్గెట్ చేస్తూ ఆరోపణల డోస్ పెంచడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు ఎమ్మెల్యే వర్గీయులు. లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మిగతా ఎమ్మెల్యేలతో ఇప్పటికిప్పుడు విబేధాలు బయటపడకున్నా…అంతర్గతంగా ఏదో నడుస్తోందన్నది ఇంటర్నల్ టాక్. లావు తనతోపాటు వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం టీడీపీలో కొంతమంది సీనియర్లకు ఇష్టం లేదట. నియోజకవర్గాల్లో తమ ప్రాధాన్యత తగ్గకుండా చూసుకోవాలన్న టార్గెట్తో… ముందు జాగ్రత్తగా ఎంపీ వర్గీయులకు చెక్ పెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే… తాజాగా ఎంపీ పనితీరు ఎలా ఉందంటూ నియోజకవర్గంలో చాలా మందికి ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చాయి. లావుకు పార్టీలో అత్యంత ప్రాధాన్యం ఇస్తందని చెప్పుకుంటున్న టైంలో… ఆయన పనితీరు గురించి టీడీపీ అధిష్టానం సర్వే నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీకృష్ణదేవరాయలు వ్యవహారశైలి గురించి పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్ళడం వల్లే…ఈ సర్వే నిర్వహించారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంపీ తీరు నచ్చని కొంతమంది నేతలైతే…. అవును, నిజమే…. అందుకే సర్వే చేశారంటూ బల్ల గుద్దుతున్నారు. మొత్తం మీద నరసరావుపేట టీడీపీలో ఇప్పుడు ఐవీఐర్ఎస్ ప్రకంపనలు రేగుతున్నాయి.
Also Read
- OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
- Off The Record: బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ లిస్టులో దానం నాగేందర్.. కాంగ్రెస్కు కూడా భారమేనా?
- OTR: ఆదోని, ఎమ్మిగనూరు కూటమిలో కుమ్ములాటలు స్థానిక ఎన్నికలపై ప్రభావం ..?
- Off The Record: ప్రభుత్వ ప్రాధాన్యతల్ని గుర్తించడంలో విఫలం..? ఉన్నతాధికారులు కాస్త తేడాగా ఉన్నారా?
తాజావార్తలు
-
AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 4 రోజుల్లో 12 బిల్లులకు ఆమోదం
-
Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
-
Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
-
Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
-
Telangana High Court : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్పై హైకోర్టు ఫైర్.. స్టే ఎత్తివేతకు నిరాకరణ.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!