Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
- మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
- సీఎం రేవంత్ వర్సెస్ సెంట్రల్ మినిస్టర్ కిషన్గా యుద్ధం..
- మెట్రో ఫేజ్ టూ ఆమోదం విషయంలో మాటల తూటాలు..
- రాష్ట్ర ప్రభుత్వానివి డైవర్షన్ పాలిటిక్స్ అంటున్న బీజేపీ..
- ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలన్న ప్లాన్లో బీజేపీ..
- కేంద్రం పేరుతో బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో కాంగ్రెస్..
- గతంలో బీఆర్ఎస్ కూడా ఇలాగే చేసిందని అంటున్న బీజేపీ..
- బీఆర్ఎస్లాగే కాంగ్రెస్ను కూడా జనం నమ్మబోరంటూ కౌంటర్స్..
- గ్రేటర్ ఎన్నికలకు ముందు పొలిటికల్ మైలేజ్ ప్లాన్స్?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: హైదరాబాద్ మెట్రో కేంద్రంగా మాటల మంటలు రేగుతున్నాయి. ఫేజ్-2 పై తెలంగాణ నేతల మధ్య పొలిటికల్ వార్ పెరుగుతోంది. ఇది తిరిగి తిరిగి కాంగ్రెస్, బీజేపీ మధ్య యుద్ధంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వ నిధులు, ఆమోదాల అంశాలకు సంబంధించి విమర్శలు, ప్రతి విమర్శలు నడుస్తున్నాయి. మెట్రో కారిడార్స్లాగే… ఇది రకరకాల మలుపులు తిరిగి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అనే స్థాయికి చేరింది. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం తగిన సహకారం అందించడం లేదని, పలుమార్లు ప్రతిపాదనలు పంపినా ఆమోదించడంలో అంతులేని జాప్యం జరుగుతోందని ఆరోపిస్తోంది రాష్ర్ట ప్రభుత్వం. ఈ ఇష్యూలో సీఎం నేరుగా…సెంట్రల్ మినిస్టర్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకురావడంలో కిషన్రెడ్డి విఫలమయ్యారని, ఇంకా చెప్పాలంటే అడుకుంటున్నారంటూ విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అటు కిషన్ మాత్రం రెండో ఫేజ్కు కేంద్రం ఆమోదం తెలుపుతుందని, అందుకు కొన్ని పద్ధతులంటూ ఉంటాయి కదా అని లాజిక్ చెబుతున్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్రంపై నెపం మోపుతున్నారని విమర్శిస్తున్నారు కాషాయ నాయకులు.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడి డైవర్షన్ కోసం ప్రయత్నించారన్నది బీజేపీ వాయిస్. ప్రస్తుతం అయితే… ఇష్యూలో రాజకీయంగా పైచేయి సాధించేందుకు కాంగ్రెస్, బీజేపీ… రెండు పార్టీలు గట్టిగా పావులు కదుపుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రాజకీయవర్గాల్లో. ఇది కేవలం మెట్రో ప్రాజెక్టు వివాదం మాత్రమే కాదని, రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీల మధ్య రాజకీయ పోరాటం అన్న విశ్లేషణలు సైతం పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం స్థాయికి ఎదగాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా…. నిధుల విషయంలో సహకారం లేందటూ…కేంద్రం మీద వత్తిడి పెంచి ప్రజల ముందు బీజేపీని దోషిగా నిలబెట్టాలని, డిఫెన్స్లోకి నెట్టాలన్న ప్లాన్లో కాంగ్రెస్ ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పంచాయతీనే కనిపించింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ కేంద్ర ప్రభుత్వంపై వివక్ష ఆరోపణలు చేస్తూ, తెలంగాణకు రావాల్సిన నిధులు నిలిపివేస్తున్నారని విమర్శించేవారు. ముఖ్యంగా ప్రాజెక్టులు, జాతీయ హోదాలు, విభజన హామీల అంశాల్లో కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడేవారు.
Also Read
- Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
- OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
- Off The Record: వనపర్తి కాంగ్రెస్లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
- OTR: నెల్లూరు వైసీపీలో మొదలైన అసంతృప్తి రగడ.. అధిష్టానం తీరుపై నేతల గుస్సా..
ఆ రకంగా కేంద్రం అన్యాయం చేస్తోందనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని, ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ అదే పని చేస్తోంటూ విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు. అప్పుడు BRSను ప్రజలు నమ్మలేదని, ఇప్పుడు సీఎం రేవంత్ చెబుతున్న మాటల్ని కూడా అదే రీతిలో నమ్మబోరంటూ కాన్ఫిడెంట్గా చెబుతున్నారు కాషాయ నాయకులు. కిషన్ రెడ్డి మీద అప్పుడు కేసీఆర్ మాట్లాడినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, ప్రజలు కూడా అదే రీతిలో బుద్ధి చెపుతారంటూ ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు కమలం లీడర్స్. మొత్తానికి గ్రేటర్ పరిధిలోని మూడు కార్పొరేషన్స్కు ఎన్నికలు జరగబోతున్న టైంలో… మెట్రో రైలు కేవలం ప్రజా రవాణా సాధనంగానే కాక, పొలిటికల్ మైలేజ్ సాధించే బలమైన అస్త్రంగా మారిపోయిందనే అభిప్రాయం బలపడుతోంది. ఈ క్రెడిట్ వార్లో అసలు ప్రాజెక్ట్ ఎంతవరకు ముందుకుసాగుతుందనేది చూడాలి.
తాజావార్తలు
-
Rhea Chakraborty: సుశాంత్ మరణం నా జీవితాన్నే మార్చేసింది.. నాన్నకు ఉద్యోగం కూడా పోయింది: రియా చక్రవర్తి
-
Virat Kohli: 18 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. విరాట్ కోహ్లీని ‘కింగ్’గా మార్చిన రికార్డ్ ఇదిగో.!
-
Anirudh – Kavya Maran Wedding : కావ్య మారన్ – అనిరుధ్ పెళ్ళికి వేదిక రెడీ?
-
Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
-
This Week Theatrical Releases: పృథ్వీరాజ్ ‘ఖలీఫా పార్ట్ 1’ నుండి రవి తేజ ‘ఇరుముడి’ వరకు.. ఈ వారం థియేటర్లలో చూడాల్సిన సౌత్ సినిమాలు..
ట్రెండింగ్
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
Sanjay Manjrekar: లైవ్లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!