BJP Telangana Organizational General Secretary : కొత్త సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఎవరు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Telangana Organizational General Secretary : బీజేపీలో అది కీలక పోస్ట్. అధ్యక్షుడు తర్వాత చాలా పవర్ ఫుల్ పదవి. ఇప్పటి వరకు ఆ పోస్ట్లో ఉన్న నేతను సడెన్గా పంపించేశారు. మరి కొత్తగా వచ్చేది ఎవరు? తెలంగాణకు సుపరిచితమైన వ్యక్తినే తీసుకొస్తారా.. లేక ఇతర రాష్ట్రాల నుంచి డంప్ చేస్తారా?
బిజెపి తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శి గా ఉన్న మంత్రి శ్రీనివాస్ ను ఆ పార్టీ జాతీయ నాయకత్వం పంజాబ్, చండీఘర్లకు పంపించింది. మంత్రి శ్రీనివాస్ ప్లేస్లో కొత్తగా ఎవరిని నియమించలేదు. ఎవరు వస్తారనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. బీజేపీ హైకమాండ్ నుంచి ఎలాంటి సంకేతాలు లేవట. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శులుగా ఆర్ఎస్ఎస్లో ఫుల్టైమర్స్గా పని చేసేవారిని నియమిస్తారు. అందుకే తెలంగాణకు వచ్చే ఆర్ఎస్ఎస్ ప్రచారకుల్లో ఎవరికి ఛాన్స్ ఉంటుందనేదానిపై ఆరా తీస్తున్నారట.
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- Off The Record : BRSలో సభ్యత్వాల నమోదు విషయంలో కేసీఆర్ సూచనలు పై అనుమానాలు?
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
ఎన్నికలకు సమయం ఎక్కువగా లేక పోవడం… పార్టీ లో సంస్థాగత ప్రధాన కార్యదర్శి కీలకం కావడంతో వచ్చే వారు ఎవరు అనే దానిపై ఆసక్తి పెరుగుతోంది. కొత్త వారు వస్తే తక్కువ టైమ్లో పార్టీ గురించి తెలుసుకోవడం.. పట్టు సాధించడం ఇబ్బంది అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం బిజెపి సంస్థాగత ప్రధాన కార్యదర్శులుగా వేరే రాష్ట్రాల్లో కొనసాగుతున్న వారిలో ఒకరిని తెలంగాణకు పంపోచ్చు అని పార్టీ వర్గాలు లెక్కలేస్తున్నాయి.
యూపీలో రెండు ఎన్నికల్లో బిజెపిని గెలిపించడంలో కీలక పాత్ర వహించిన సంస్థాగత ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ తెలంగాణకు వస్తారని అనుకుంటున్నారు. ఆయన అమిత్ షా కి సన్నిహితుడు అనే టాక్ ఉంది. ప్రస్తుతం తెలంగాణ పై అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకే ఆయన తనకు నమ్మకస్తుడైన వ్యక్తిని తెలంగాణకు పంపుతారని టాక్. ఒకవేళ సునీల్ బన్సల్ వస్తే.. ఆయనకు సహా సంఘటన కార్యదర్శిగా రాష్ట్రానికి చెందిన RSS ప్రచారక్ ను పెడతారని పార్టీ వర్గాలు లెక్కలేస్తున్నాయి.
ఇదే సమయంలో బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్గా ఉన్న తరుణ్చుగ్ను కూడా మార్చొచ్చని చర్చ నడుస్తోంది. ఆయన స్థానంలో కొత్త ఇంఛార్జ్ వస్తారట. అప్పుడు కొత్త నేతల సారథ్యంలో బీజేపీ పనిలో స్పీడ్ పెరుగుతుందని కాషాయ శిబిరం భావిస్తోంది. మరి.. బీజేపీ కేంద్ర నాయకత్వం ఏం చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
-
Sharwanand : ‘జార్జ్ కృష్ణ’ కోసం మిస్ ఇండియా.. వైట్ల హిట్ ఇస్తాడా?
-
Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!