Tiruchanur Tension:తిరుచానూరులో ఉద్రిక్తత.. వైసీపీ వర్సెస్ టీడీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరుచానూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. నారా లోకేష్ బస చేస్తున్న టెంట్లో సైట్ వద్ద నోటికి తెల్ల రిబ్లన్ కట్టుకుని కొందరు తిరుపతి వైసిపి కార్పొరేటర్లు సహా కేడర్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాతో రండి చేసిన అభివృద్ధి చూపిస్తామంటూ ఫ్ల కార్డులు చేత పట్టి నిరసనకు దిగారు వైసీపీ నేతలు.

Also Read
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
Read Also: TTD Temple Jubileehills Live: జూబ్లిహిల్స్ టీటీడీ ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై నిన్న తీవ్రమైన స్ధాయిలో విమర్శలు చేశారు నారా లోకేష్. దీంతో వైసీపీ నేతలు ఈ విధంగా నిరసనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు అలిపిరి పోలీసు స్టేషను కు వైసీపీ నేతలను తరలించారు. చంద్రబాబునాయుడు, లోకేష్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో అక్కడ వాతావరణం వేడెక్కింది. లోకేష్ నాయుడు గారు అవినీతిని నిరూపించండి లేదా క్షమాపణలు చెప్పండి అంటూ ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. వారిని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు.
ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డిపై అలాగే తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతి జేసీఎస్ అధ్యక్షుడు బాలిశెట్టి కిషోర్ ఆదర్వంలో యువగళం యాత్రలో నారా లోకేష్ బస చేస్తున్న కుటీరం వద్ద ఈరోజు ఉదయం శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బాలిశెట్టి కిషోర్ మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధి గూర్చి ప్రశ్నించే అర్హత తెలుగుదేశం పార్టీ నాయకులకి లేదని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జేసీఎస్ మద్దాలి శేఖర్ రాయల్, సోషల్ మీడియా జిల్లా కో కన్వీనర్ మైలం శ్రీకాంత్ రెడ్డి, ఉదయ్ వంశీ, వాసు యాదవ్, ఇరగం అనిల్ రెడ్డి, సూరి, కొఠారి సుభాష్, ప్రదీప్, మించాల చందు, గోవర్ధన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: Road Accident: కుప్పంలో ఘోర రోడ్డుప్రమాదం…ముగ్గురు వైద్యవిద్యార్ధులు మృతి
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?