Site icon NTV Telugu

Bhumana Karunakar Reddy: స్వామికి చంద్రబాబు ఒక్కడే భక్తుడా? టీటీడీ మాజీ ఛైర్మన్ ఫైర్

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy: వైసీపీ, మాజీ సీఎం జగన్‌ను నాశనం చేయాలని సీఎం చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. దానికోసం ఇప్పటి దాక వ్యవస్థలను వాడుకున్నారు‌.. ఇప్పుడు వేంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారని విమర్శించారు. దొరికిపోయిన దొంగలు అనేలా చంద్రబాబు, పవన్, బీజేపీ ‌నేత మాధవ్ ప్రెస్ మీట్ ఉందన్నారు. తప్పులు చేసినందుకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని జగన్ డిమాండ్ చేస్తే.. ఉలిక్కిపడి చంద్రబాబు ఈరోజు ముగ్గురు నేతలను తీసుకుని వచ్చారన్నారు. అవసరం అయితే గొడ్డు మాసం తింటాను అని పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పారని ఆరోపించారు. చంద్రబాబుకు అమ్ముడుపోయి పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారన్నారు. స్వామికి చంద్రబాబు ఒక్కడే భక్తుడా?.. ఇంకా ఎవరు లేరా‌? అని ప్రశ్నించారు చంద్రబాబు హయాంలోనే వేలాది ఆలయాలు కూల్చివేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో మద్యం అమ్మారని.. బిర్యానీ తిన్నారన్నారు. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఇలా ఎన్నో దారుణాలు జరిగాయని విమర్శించారు..

READ MORE: Story Board : స్మార్ట్ ఫోన్ ఉంటే.. వ్యక్తిగత గోప్యత డొల్లేనా? WhatsAppకు సుప్రీం వార్నింగ్

Exit mobile version