YS Jagan: పులివెందలలో పర్యటించనున్న మాజీ సీఎం జగన్

  • సోమవారం (మార్చి 24) పులివెందులలో పర్యటించనున్న ఏపీ మాజీ సీఎం జగన్.
  • తీవ్ర ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన అరటి తోటలను పరిశీలన చేయనున్న జగన్.
  • అరటి రైతులతో సమావేశమై, వారి సమస్యలను తెలుసుకోనున్నారు.
Ys Jagan

Ys Jagan

YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం (మార్చి 24) పులివెందులలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన లింగాల మండలంలో ఇటీవల తీవ్ర ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన అరటి తోటలను పరిశీలించనున్నారు. రైతుల కష్టాలను నేరుగా తెలుసుకుని, వారికి భరోసా కల్పించేందుకు జగన్ ఈ పర్యటనకు సిద్ధమయ్యారు.

Read Also: Water from air: గాలి నుంచి నీరు తయారు చేస్తున్న భారతీయ సంస్థ.. ఎలా సాధ్యం..?

×
×
Ad

పర్యటన వివరాల విషయానికి వస్తే.. ఉదయం 8.30 గంటలకు– వైఎస్ జగన్ పులివెందులలోని తన నివాసం నుంచి బయలుదేరి లింగాల మండలానికి చేరుకుంటారు. లింగాల మండలంలో ఇటీవల తుఫాను ప్రభావంతో వేల ఎకరాల్లో అరటి తోటలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ ప్రాంతాన్ని పరిశీలించి, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా గమనిస్తారు. ఆపై నష్టపోయిన అరటి రైతులతో సమావేశమై, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఇక రైతులతో చర్చ అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.

Read Also: SRH vs RR: సొంత గడ్డపై సన్‌రైజర్స్ ఘన విజయం.. ఐపీఎల్‌ చరిత్రలో మరో రికార్డు..

ఈదురుగాలులు, వర్షాల వల్ల లింగాల మండలంలో పంట నష్టం తీవ్రమైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రత్యక్షంగా అక్కడి రైతులను పరామర్శించనున్నారు. ఈ పర్యటనలో ఆయన రైతులకు ఏమైనా భరోసా ప్రకటిస్తారా? ప్రభుత్వాన్ని ఎలాంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తారా? అనే విషయాలు ఆసక్తిగా మారాయి.