Kriya Yoga: పరమహంస యోగానంద ఆత్మసాక్షాత్కార సాధనా పాఠాలు ఇక తెలుగులో…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paramahamsa Yogananda: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ‘ఒక యోగి ఆత్మకథ’ రచయిత పరమహంస యోగానంద 1917లో స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా తెలుగువారికి శుభవార్తను అందించింది. యోగానంద ఆత్మసాక్షాత్కార సాధనా పాఠాల (వైఎస్ఎస్ క్రియా యోగ) తెలుగు అనువాదాలు యోగదా సత్సంగ సొసైటీ (వైఎస్ఎస్) ఉపాధ్యక్షులు స్వామి స్మరణానంద, బ్రహ్మచారి కేదారానంద్ జీ ద్వారా విడుదలయ్యాయి.
ఈ విశేషాలను స్వామి స్మరణానంద తెలియచేస్తూ, ”జగద్గురువు పరమహంస యోగానంద విరచిత ‘ఒక యోగి ఆత్మకథ’ గ్రంథం 1946 డిసెంబరులో విడుదలైనప్పటి నుంచి నిరంతరంగా అత్యధికంగా అమ్ముడవుతోంది. దీని ద్వారా లక్షలాది మందికి యోగా, ధ్యానాన్ని పరమహంస యోగానంద పరిచయం చేశారు. ప్రాచీన యోగ విజ్ఞాన శాస్త్రం గురించి అలాగే ధ్యానానికి సంబంధించి చాలా కాలం నుంచి గౌరవింపబడుచున్న సాంప్రదాయానికి సంబంధించిన లోతైన పరిచయం కూడా ఈ గ్రంథంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఆధ్యాత్మిక అన్వేషకులను వారి జీవితాల్లో సమతుల్యమైన దైవాన్నే కేంద్రంగా చేసుకుని జీవించే విధానాన్ని ఈ రచన ప్రేరేపించింది. పరమహంస యోగానంద అద్భుతమైన జ్ఞానం ఆయన అనేక రచనలు, ప్రచురణలలో వ్యక్తీకరించబడింది. ఆయన బోధనలలో అంతర్గతంగా క్రియాయోగ పవిత్ర శాస్త్రం, రాజయోగం యొక్క స్వరూపము ఉంది. ఇది శరీరం, మనస్సు రెండింటినీ నిశ్చలం చేయడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఆలోచనలు, భావోద్వేగాలు, ఇంద్రియ సంవేదనల సాధారణ కల్లోలం నుంచి ఒకరి శక్తిని, ధ్యాసను ఉపసంహరించుకోవడం సాధ్యపడుతుంది. ఆ అంతర్గత నిశ్చలతలో, భక్తులు గాఢమౌతున్న అంతర్గత శాంతిని అనుభవిస్తారు. వారి స్వీయ ఆత్మతో సామరస్యం పొందుతారు” అని చెప్పారు. ఇంతవరకూ ఆంగ్ల, హిందీలో ఉన్న వైఎస్ఎస్ క్రియా యోగ పాఠలను ఇటీవలే తమిళ, తెలుగు భాషలలోకి అనువదించామని తెలిపారు.
Also Read
- China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
- Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
- Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
విశేషం ఏమంటే… ధాన్యం పట్ల ఆసక్తి ఉన్న వారికి దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించడం కోసం హైదరాబాద్, బేగంపేటలోని యోగదా సత్సంగ ధ్యానకేంద్రంలో 11వ తేదీ సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరున్నర వరకూ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో స్వామి స్మరణానంద ధ్యానం పట్ల ఆసక్తి ఉన్న వారి సందేహాలను నివృత్తి చేయబోతున్నారు.
తాజావార్తలు
-
Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ‘చాణక్యుడి’ ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
-
China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
-
Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
-
Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
-
Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!