Site icon NTV Telugu

Telangana Rains: తెలంగాణకు వర్ష సూచన.. 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌

Telangana Rains

Telangana Rains

Telangana Rains: తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ వర్షాకాలంలో తెలంగాణలో 15 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో శనివారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-ఖమ్మంగూడెంలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. ఈ నెల 25 నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్లి రాజస్థాన్ నుంచి వెనక్కి వెళ్లనున్నాయని వెల్లడించారు. దీని ప్రభావంతో డిసెంబర్ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

మరో మూడు రోజులు వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శుక్రవారం ఉదయం వరకు ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటల వరకు అత్యధికంగా వరంగల్ జిల్లా పర్వతగిరిలో 141.3, హన్మకొండ జిల్లా పరకల్‌లో 126.3, వరంగల్‌ నెక్కొండలో 121.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హన్మకొండ జిల్లా ధర్మసాగర్‌లో 115.5 మిల్లీమీటర్లు, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి)లో 114.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు వర్షం కురిసింది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఆరు గంటల్లో జూబ్లీహిల్స్‌లో 70.3 మిల్లీమీటర్లు, బంజారాహిల్స్‌లో 67.3 మిల్లీమీటర్లు, మెహిదీపట్నంలో 65.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాంపల్లిలో 63.8, మోండా మార్కెట్‌లో 63.8, ఆసిఫ్‌నగర్‌లో 60 మి.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.
Maharastra: తండ్రి చనిపోయాడని… కూతురును బిల్డింగ్ పై నుంచి తోసేసి చంపిన తల్లి

Exit mobile version