Krishna Devarayalu: టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీ.. మళ్లీ గెలిపించాలని పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికలకు 50 రోజుల సమయం మాత్రమే ఉందని ఎంపీ కృష్ణదేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) అన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో ఏర్పాటు చేసిన ‘రా.. కదలిరా’ సభలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు.
రాబోయే ఎన్నికలు రెండు వర్గాలకు, రెండు కులాలకు మధ్య యుద్ధం కాదన్నారు. పల్నాడు ప్రజల కష్టాలు తీరాలని కోరారు. పల్నాడు ప్రాంతానికి పూర్తిస్థాయిలో పనులు చేసినట్లు తెలిపారు. వరికపుడిసెల ప్రాజెక్టుకి అటవీ శాఖ అనుమతులు కోసం పని చేసినట్లు వెల్లడించారు. అలాగే పల్నాడు ప్రాంతాన్ని జాతీయ రహదారులతో కలిపి రూ.3000 కోట్ల కేంద్ర నిధులు తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు.
Also Read
అలాగే పల్నాడుకు కేంద్రీయ విద్యాలయాలు కూడా తీసుకొచ్చినట్లు వివరించారు. రైతుల కోసం 400 కిలోమీటర్ల డొంక రోడ్లు వేయిపించినట్లు పేర్కొన్నారు. గోదావరి నీటిని సాగర్ కుడికాలువకు తీసుకువస్తే కుడికాలువ పరిధిలో ఉన్న లక్షలాది ఎకరాలకు, రైతులకు మేలు కలుగుతుందన్నారు. పల్నాడు ప్రజలు మరొకసారి తనను ఆశీర్వదించాలని ఎంపీ కృష్ణదేవరాయలు కోరారు.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
-
OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
-
OTR: తుపాకి వదిలి ప్రజాస్వామ్య బాటలో.. దేవ్ జీ పొలిటికల్ ఎంట్రీపై చర్చ
-
Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
-
Mamitha Baiju: ప్రముఖ హీరోయిన్ మమిత బైజుకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!