China: మూడో సారి చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్..?
China: చైనా దేశానికి మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు జిన్ పింగ్ సిద్ధమవుతున్నారు. ఇందుకు అనుగుణంగానే అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా పావులు కదుపులోంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా తీర్మానం చేసే అలోచనలో ఉంది. ఇప్పటికే రెండు సార్లు అధ్యక్షుడిగా జిన్ పింగ్ అధికారం చేపట్టారు. ఇదిలా ఉంటే మూడో సారే కాకుండా శాశ్వతంగా అధ్యక్షుడిగా జిన్ పింగే ఉండేలా పావులు కదుపుతున్నారు. 2012లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమంగా జిన్ పింగ్ తన బలాన్ని పెంచుకొన్నారు. పార్టీలో, దేశంలోని కీలక అధికార పదవుల్లో తన వర్గీయులను నియమించుకోవడం ద్వారా తనకు ఎదురులేకుండా చేసుకున్నారు. అంతకుముందు అధికారంలో ఉన్న హు జింటావో పార్టీలో ప్రజాస్వామిక ధోరణులు, సమష్టి నాయకత్వంపై దృష్టి కేంద్రీకరించగా అందుకు భిన్నంగా ఏకస్వామ్యం, ఏక వ్యక్తి పాలనవైపు జిన్పింగ్ మొగ్గుచూపడం గమనార్హం.
Read Also: Facebook : జుకర్ బర్గ్కు పుతిన్ షాక్.. తీవ్రవాద సంస్థల జాబితాలో ఫేస్ బుక్
Also Read
- jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
2013లో జిన్పింగ్… ద్రోహులుగా, అవినీతిపరులుగా లేదా అసమర్థంగా భావించే అధికారులను తొలగించడానికి పెద్ద క్యాంపెయిన్ ప్రారంభించారు. ఆ ఖాళీ స్థానాలను తన మిత్రపక్షాలతో భర్తీ చేయడం ద్వారా జిన్పింగ్ తన అధికారాన్ని నిర్మించుకున్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, జిన్పింగ్ పదవీకాలంలో ఇప్పటివరకు 47 లక్షలకు పైగా అధికారులను విచారించారు.
జిన్పింగ్..తాను చనిపోయేవరకు చైనాకు అధ్యక్షుడుగా ఉండాలని కలలు కంటున్నందున, అతని డ్రీమ్స్ కి ఆ దేశ సైన్యం ప్రతిబంధకంగా మారవచ్చు. దీన్ని ముందుగానే పసిగట్టిన జిన్పింగ్ అన్ని తిరుగుబాట్లను అరికట్టడానికి 2015 నుండి సైన్యంలో విస్తృతమైన సంస్కరణలు, తొలగింపులను ప్రారంభించారు. తనకు నమ్మకస్తులైన వారిని సైన్యంలో ఉన్నత స్థానాల్లో నియమించడం ప్రారంభించాడు.
Read Also: BCCI: బీసీసీఐ నుంచి గంగూలీ అవుట్.. ఐపీఎల్ ఛైర్మన్ పదవినీ తిరస్కరించిన దాదా
ఇక,మీడియాను తన చెప్పుచేతుల్లో ఉంచుకోవటానికి,తను చెప్పిందే మీడియాలో వేదం అని చెప్పేలా చేయడానికి..ప్రభుత్వ మీడియాని తన ఆధీనంలోకి తీసుకునేందుకు జిన్పింగ్ కూడా చాలా మార్పులు చేశారు. 2016లో దేశ మీడియాకు ఇచ్చిన ఉత్తర్వులో.. “పార్టీ హాయ్ ఇంటిపేరు హై’ అనే సందేశాన్ని ఇచ్చిన పార్టీ లైన్ను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. జిన్ పింగ్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వ మీడియా యొక్క స్వతంత్రత క్రమంగా క్షీణించింది. జిన్ పింగ్ కు సంబంధించిన ప్రచారం క్రమంగా పెరిగింది. దేశంలోనే అత్యున్నత వ్యక్తి అని 2017 సంవత్సరంలో ఇచ్చిన ప్రకటనలో జిన్పింగ్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!