China: మూడో సారి చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనా దేశానికి మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు జిన్ పింగ్ సిద్ధమవుతున్నారు. ఇందుకు అనుగుణంగానే అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా పావులు కదుపులోంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా తీర్మానం చేసే అలోచనలో ఉంది. ఇప్పటికే రెండు సార్లు అధ్యక్షుడిగా జిన్ పింగ్ అధికారం చేపట్టారు. ఇదిలా ఉంటే మూడో సారే కాకుండా శాశ్వతంగా అధ్యక్షుడిగా జిన్ పింగే ఉండేలా పావులు కదుపుతున్నారు. 2012లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమంగా జిన్ పింగ్ తన బలాన్ని పెంచుకొన్నారు. పార్టీలో, దేశంలోని కీలక అధికార పదవుల్లో తన వర్గీయులను నియమించుకోవడం ద్వారా తనకు ఎదురులేకుండా చేసుకున్నారు. అంతకుముందు అధికారంలో ఉన్న హు జింటావో పార్టీలో ప్రజాస్వామిక ధోరణులు, సమష్టి నాయకత్వంపై దృష్టి కేంద్రీకరించగా అందుకు భిన్నంగా ఏకస్వామ్యం, ఏక వ్యక్తి పాలనవైపు జిన్పింగ్ మొగ్గుచూపడం గమనార్హం.
Read Also: Facebook : జుకర్ బర్గ్కు పుతిన్ షాక్.. తీవ్రవాద సంస్థల జాబితాలో ఫేస్ బుక్
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
2013లో జిన్పింగ్… ద్రోహులుగా, అవినీతిపరులుగా లేదా అసమర్థంగా భావించే అధికారులను తొలగించడానికి పెద్ద క్యాంపెయిన్ ప్రారంభించారు. ఆ ఖాళీ స్థానాలను తన మిత్రపక్షాలతో భర్తీ చేయడం ద్వారా జిన్పింగ్ తన అధికారాన్ని నిర్మించుకున్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, జిన్పింగ్ పదవీకాలంలో ఇప్పటివరకు 47 లక్షలకు పైగా అధికారులను విచారించారు.
జిన్పింగ్..తాను చనిపోయేవరకు చైనాకు అధ్యక్షుడుగా ఉండాలని కలలు కంటున్నందున, అతని డ్రీమ్స్ కి ఆ దేశ సైన్యం ప్రతిబంధకంగా మారవచ్చు. దీన్ని ముందుగానే పసిగట్టిన జిన్పింగ్ అన్ని తిరుగుబాట్లను అరికట్టడానికి 2015 నుండి సైన్యంలో విస్తృతమైన సంస్కరణలు, తొలగింపులను ప్రారంభించారు. తనకు నమ్మకస్తులైన వారిని సైన్యంలో ఉన్నత స్థానాల్లో నియమించడం ప్రారంభించాడు.
Read Also: BCCI: బీసీసీఐ నుంచి గంగూలీ అవుట్.. ఐపీఎల్ ఛైర్మన్ పదవినీ తిరస్కరించిన దాదా
ఇక,మీడియాను తన చెప్పుచేతుల్లో ఉంచుకోవటానికి,తను చెప్పిందే మీడియాలో వేదం అని చెప్పేలా చేయడానికి..ప్రభుత్వ మీడియాని తన ఆధీనంలోకి తీసుకునేందుకు జిన్పింగ్ కూడా చాలా మార్పులు చేశారు. 2016లో దేశ మీడియాకు ఇచ్చిన ఉత్తర్వులో.. “పార్టీ హాయ్ ఇంటిపేరు హై’ అనే సందేశాన్ని ఇచ్చిన పార్టీ లైన్ను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. జిన్ పింగ్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వ మీడియా యొక్క స్వతంత్రత క్రమంగా క్షీణించింది. జిన్ పింగ్ కు సంబంధించిన ప్రచారం క్రమంగా పెరిగింది. దేశంలోనే అత్యున్నత వ్యక్తి అని 2017 సంవత్సరంలో ఇచ్చిన ప్రకటనలో జిన్పింగ్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!