OMG: అనుమానం పెనుభూతం లాంటిది. ఒక్క సారి అనుమానం మొదలైందంటే గొడవలు ఆటోమేటిక్ గా వస్తాయి. అయితే చిన్న చిన్న విషయాలకే రిలేషన్షిప్ను చెడగొట్టుకోవడం, ఆ తర్వాత బ్రేకప్ కావడం చాలా సార్లు చూసే ఉంటారు. ఓ మహిళ కూడా తన ప్రియుడితో ఏదో విషయంపై వాగ్వాదానికి దిగింది. వివాదం పెరిగింది. ఆమె కోపం తారాస్థాయికి చేరుకుంది. కోపంతో చేసిన పనికి ఈ రోజు కటకటాలు లెక్కపెడుతుంది.
Read Also:Student Suicide: ఇంటర్ విద్యార్థి సూసైడ్.. ఐ మిస్ యూ ఫ్రెండ్స్ అంటూ స్టేటస్
ఈ షాకింగ్ ఘటన చైనాలోని జెజియాంగ్కు చెందినది. జూన్ 28న 38 ఏళ్ల మహిళ తన 44 ఏళ్ల ప్రియుడిని కారుతో గుద్ది హత్య చేసింది. దీంతో పోలీసులు ఆ మహిళను అరెస్టు చేశారు. హత్యకు ముందు ఇద్దరూ ఓ ప్రదేశంలోని పార్కింగ్ ఏరియాలో ఉన్నారు. ఆ తర్వాత ఏదో విషయంలో వారి మధ్య వాగ్వాదం మొదలైందని చెబుతున్నారు. ఆ తర్వాత ఆ మహిళ కోపాన్ని అదుపు చేసుకోలేక ఆగ్రహానికి గురైంది. అనంతరం ప్రియుడిని కారుతో గుద్దేసింది. అయినా ఆమె కోపం చల్లారకపోవడంతో ఆమె తన ప్రియుడి శరీరంపై ఐదుసార్లు కారును నడపడానికి ప్రయత్నించింది. హృదయ విదారకమైన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఫుటేజీలో ప్రియుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Read Also: TS BJP: బండిపై రఘునందన్ వ్యాఖ్యలు.. హైకమాండ్ కు చేరిన ఇష్యూ
దీంతో ఆ మహిళ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దాదాపు ఐదుసార్లు ఆ వ్యక్తిపై నుంచి కారును నడిపింది. ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కారు వదిలి పారిపోయింది. ఆమె కారు టైర్ కింద ప్రియుడి కాలు, కడుపు బాగా నలిగిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.