Navdeep Singh-PM Modi: నవ్దీప్.. ఎందుకు అంత కోపం: ప్రధాని మోడీ
- పారాలింపిక్స్లో గోల్డ్ గెలుచుకున్న నవ్దీప్
- ఎందుకు అంత కోపం అని ప్రశ్నించిన మోడీ
- ప్రధానికి జెర్సీని అందించిన శీతల్ దేవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Medal Winner Navdeep Singh Meets PM Modi: పారిస్ పారాలింపిక్స్ 2024లో పతకం గెలిచిన భారత అథ్లెట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. గురువారం ఢిల్లీలోని తన నివాసంలో భారత పారా అథ్లెట్లను కలిసిన ప్రధాని.. వారితో సరదాగా ముచ్చటించారు. అథ్లెట్ జీవాంజి దీప్తి, షూటర్ అవని లేఖరా, జూడో అథ్లెట్ కపిల్ పర్మార్, ఆర్చర్ శీతల్ దేవి, డిస్కస్ త్రోయర్ యోగేశ్, జావెలిన్ త్రోయర్ నవ్దీప్ సింగ్ సహా మరికొందరు ప్రధానిని కలిశారు. కేంద్ర క్రీడల మంత్రి మన్సుక్ మాండవీయ, భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర జజారియా కూడా తదితరులు పారాలింపియన్లను కలిశారు.
జావెలిన్ త్రోయర్ నవ్దీప్ ప్రధాని మోడీకి టోపీ బహూకరించాడు. నవ్దీప్ మరుగుజ్జు కావడంతో ప్రధాని కింద కూర్చుని టోపీని తీసుకుని కాసేపు మాట్లాడారు. పారాలింపిక్స్లో త్రో విసిరిన తర్వాత ఎందుకు అంత కోపాన్ని ప్రదర్శించావ్ నవ్దీప్ అని ప్రధాని అడిగారు. ‘టోక్యో పారాలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచాను. ఈసారి మీకు మాటిచ్చినట్టుగానే.. మెడల్ గెలుచుకున్నాను. ఆ భావోద్వేగంలో అలా చేశాను’ అని నవ్దీప్ బదులిచ్చాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్41 ఫైనల్లో రెండో స్థానంలో నిలిచిన నవ్దీప్.. సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. అయితే అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్ సదేగ్పై అనర్హత వేటు పడడంతో గోల్డ్ మెడల్ నవదీప్ సొంతమైంది.
Also Read
- Bhojshala Case: "భోజ్శాల హిందువులదే".. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
Also Read: Gurucharan Dies: టాలీవుడ్లో విషాదం.. పాటల రచయిత గురుచరణ్ కన్నుమూత!
రెండు చేతుల్లేని పారా ఆర్చర్ శీతల్ దేవి కాలితో సంతకం చేసిన జెర్సీని ప్రధాని మోడీకి అందించింది. అథ్లెట్ కపిల్ పర్మార్ తన కాంస్య పతకంపై ప్రధాని సంతకాన్ని తీసుకున్నాడు. ఇక పారిస్ పారాలింపిక్స్లో భారత్ 29 పతకాలు గెలుచుకుంది. పారాలింపిక్స్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ ప్రదర్శన. పారిస్లో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు భారత్ ఖాతాలో చేరాయి.
తాజావార్తలు
-
Bhojshala Case: “భోజ్శాల హిందువులదే”.. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
-
Monsoon 2026: గుడ్న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!