Navdeep Singh-PM Modi: నవ్దీప్.. ఎందుకు అంత కోపం: ప్రధాని మోడీ
- పారాలింపిక్స్లో గోల్డ్ గెలుచుకున్న నవ్దీప్
- ఎందుకు అంత కోపం అని ప్రశ్నించిన మోడీ
- ప్రధానికి జెర్సీని అందించిన శీతల్ దేవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Medal Winner Navdeep Singh Meets PM Modi: పారిస్ పారాలింపిక్స్ 2024లో పతకం గెలిచిన భారత అథ్లెట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. గురువారం ఢిల్లీలోని తన నివాసంలో భారత పారా అథ్లెట్లను కలిసిన ప్రధాని.. వారితో సరదాగా ముచ్చటించారు. అథ్లెట్ జీవాంజి దీప్తి, షూటర్ అవని లేఖరా, జూడో అథ్లెట్ కపిల్ పర్మార్, ఆర్చర్ శీతల్ దేవి, డిస్కస్ త్రోయర్ యోగేశ్, జావెలిన్ త్రోయర్ నవ్దీప్ సింగ్ సహా మరికొందరు ప్రధానిని కలిశారు. కేంద్ర క్రీడల మంత్రి మన్సుక్ మాండవీయ, భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర జజారియా కూడా తదితరులు పారాలింపియన్లను కలిశారు.
జావెలిన్ త్రోయర్ నవ్దీప్ ప్రధాని మోడీకి టోపీ బహూకరించాడు. నవ్దీప్ మరుగుజ్జు కావడంతో ప్రధాని కింద కూర్చుని టోపీని తీసుకుని కాసేపు మాట్లాడారు. పారాలింపిక్స్లో త్రో విసిరిన తర్వాత ఎందుకు అంత కోపాన్ని ప్రదర్శించావ్ నవ్దీప్ అని ప్రధాని అడిగారు. ‘టోక్యో పారాలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచాను. ఈసారి మీకు మాటిచ్చినట్టుగానే.. మెడల్ గెలుచుకున్నాను. ఆ భావోద్వేగంలో అలా చేశాను’ అని నవ్దీప్ బదులిచ్చాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్41 ఫైనల్లో రెండో స్థానంలో నిలిచిన నవ్దీప్.. సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. అయితే అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్ సదేగ్పై అనర్హత వేటు పడడంతో గోల్డ్ మెడల్ నవదీప్ సొంతమైంది.
Also Read
- Astrology: మే 30 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
Also Read: Gurucharan Dies: టాలీవుడ్లో విషాదం.. పాటల రచయిత గురుచరణ్ కన్నుమూత!
రెండు చేతుల్లేని పారా ఆర్చర్ శీతల్ దేవి కాలితో సంతకం చేసిన జెర్సీని ప్రధాని మోడీకి అందించింది. అథ్లెట్ కపిల్ పర్మార్ తన కాంస్య పతకంపై ప్రధాని సంతకాన్ని తీసుకున్నాడు. ఇక పారిస్ పారాలింపిక్స్లో భారత్ 29 పతకాలు గెలుచుకుంది. పారాలింపిక్స్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ ప్రదర్శన. పారిస్లో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు భారత్ ఖాతాలో చేరాయి.
తాజావార్తలు
-
Astrology: మే 30 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..