Navdeep Singh-PM Modi: నవ్దీప్.. ఎందుకు అంత కోపం: ప్రధాని మోడీ
- పారాలింపిక్స్లో గోల్డ్ గెలుచుకున్న నవ్దీప్
- ఎందుకు అంత కోపం అని ప్రశ్నించిన మోడీ
- ప్రధానికి జెర్సీని అందించిన శీతల్ దేవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Medal Winner Navdeep Singh Meets PM Modi: పారిస్ పారాలింపిక్స్ 2024లో పతకం గెలిచిన భారత అథ్లెట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. గురువారం ఢిల్లీలోని తన నివాసంలో భారత పారా అథ్లెట్లను కలిసిన ప్రధాని.. వారితో సరదాగా ముచ్చటించారు. అథ్లెట్ జీవాంజి దీప్తి, షూటర్ అవని లేఖరా, జూడో అథ్లెట్ కపిల్ పర్మార్, ఆర్చర్ శీతల్ దేవి, డిస్కస్ త్రోయర్ యోగేశ్, జావెలిన్ త్రోయర్ నవ్దీప్ సింగ్ సహా మరికొందరు ప్రధానిని కలిశారు. కేంద్ర క్రీడల మంత్రి మన్సుక్ మాండవీయ, భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర జజారియా కూడా తదితరులు పారాలింపియన్లను కలిశారు.
జావెలిన్ త్రోయర్ నవ్దీప్ ప్రధాని మోడీకి టోపీ బహూకరించాడు. నవ్దీప్ మరుగుజ్జు కావడంతో ప్రధాని కింద కూర్చుని టోపీని తీసుకుని కాసేపు మాట్లాడారు. పారాలింపిక్స్లో త్రో విసిరిన తర్వాత ఎందుకు అంత కోపాన్ని ప్రదర్శించావ్ నవ్దీప్ అని ప్రధాని అడిగారు. ‘టోక్యో పారాలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచాను. ఈసారి మీకు మాటిచ్చినట్టుగానే.. మెడల్ గెలుచుకున్నాను. ఆ భావోద్వేగంలో అలా చేశాను’ అని నవ్దీప్ బదులిచ్చాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్41 ఫైనల్లో రెండో స్థానంలో నిలిచిన నవ్దీప్.. సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. అయితే అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్ సదేగ్పై అనర్హత వేటు పడడంతో గోల్డ్ మెడల్ నవదీప్ సొంతమైంది.
Also Read
- New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
- LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
Also Read: Gurucharan Dies: టాలీవుడ్లో విషాదం.. పాటల రచయిత గురుచరణ్ కన్నుమూత!
రెండు చేతుల్లేని పారా ఆర్చర్ శీతల్ దేవి కాలితో సంతకం చేసిన జెర్సీని ప్రధాని మోడీకి అందించింది. అథ్లెట్ కపిల్ పర్మార్ తన కాంస్య పతకంపై ప్రధాని సంతకాన్ని తీసుకున్నాడు. ఇక పారిస్ పారాలింపిక్స్లో భారత్ 29 పతకాలు గెలుచుకుంది. పారాలింపిక్స్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ ప్రదర్శన. పారిస్లో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు భారత్ ఖాతాలో చేరాయి.
తాజావార్తలు
-
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా ‘శ్రీశ్రీ’.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
Lenin Day 1 Collections : అయ్యగారు అదిరిపోయే స్టార్ట్.. లెనిన్ డే-1 ఎంతంటే?
-
LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
-
Deepika Padukone: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతున్న దీపిక… త్వరలోనే గుడ్ న్యూస్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!