Site icon NTV Telugu

Indian Sailors: 9 నెలల తర్వాత నైజీరియా నుంచి స్వదేశానికి వచ్చిన 16 మంది భారతీయులు

Indian Sailor

Indian Sailor

Indian Sailors: నైజీరియాలో నిర్బంధించిన భారతీయ నావికులు తొమ్మిది నెలల తర్వాత స్వదేశానికి చేరుకున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వారి ముఖంలో ఆనందం వికసించింది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను ఉల్లంఘించినందుకు 16 మంది భారతీయ నావికులను అదుపులోకి తీసుకున్నారు. అందరినీ 9 నెలల పాటు జైల్లో ఉంచారు. వీరంతా శనివారం కొచ్చి విమానాశ్రయంలో దిగారు. వారికి స్వాగతం పలికేందుకు వారి కుటుంబ సభ్యులు, భారత అధికారులు విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు. సాను జోష్ అనే నావికుడు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Read Also:Telangana : మహబూబాబాద్ లో భారీ అగ్నిప్రమాదం..15 వేల క్వింటాళ్ల ధాన్యం బుగ్గిపాలు..

భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు
‘మా జీవితాలు నైజీరియాలోనే ముగుస్తాయని మాకు చెప్పారని, అయితే మాకు సహాయం చేసినందుకు భారత ప్రభుత్వం, కేరళ ప్రభుత్వంతో సహా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని భారతీయ నావికులు అన్నారు. మరో నావికుడు వి విజిత్ మాట్లాడుతూ.. ఈ విషయంలో భారత ప్రభుత్వం అద్భుతమైన కృషి చేసిందని, నావికులందరినీ విడుదల చేయడంలో వారు అద్భుతంగా పని చేశారని కొనియాడారు. నౌకలో అప్పుడు మొత్తం 26 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 16 మంది భారతీయులు ఉన్నారు. వారిని ఆగస్టు 2022లో ఈక్వటోరియల్ గినియాలో అదుపులోకి తీసుకున్నారు.. తరువాత నవంబర్ 2022లో నైజీరియాకు తీసుకెళ్లారు.

Read Also:Petrol-Diesel Price: పెట్రోలు-డీజిల్ ధరలు తగ్గుతాయి : పెట్రోలియం మంత్రి

Exit mobile version