Cough Syrups: ఉజ్బెకిస్తాన్లో ఈ భారతీయ దగ్గు సిరప్లను ఉపయోగించొద్దు.. డబ్ల్యూహెచ్వో సిఫార్సు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cough Syrups: నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్లను ఉజ్బెకిస్థాన్లోని పిల్లలకు ఉపయోగించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేసింది. మారియన్ బయోటెక్ తయారు చేసిన వైద్య ఉత్పత్తులు నాణ్యతా ప్రమాణాలు అందుకోవడంలో విఫలమయ్యాయని.. అందువల్లే వాటిని ఉపయోగించొద్దని బుధవారం డబ్ల్యూహెచ్వో ఓ హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన వెబ్సైట్లో పేర్కొంది.
ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన రెండు సిరప్లు ఆంబ్రోనాల్(AMBRONOL), డాక్-1 మాక్స్(DOK-1) సిరప్ల తయారీ నాణ్యత ప్రమాణాలు పాటించలేదని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. దగ్గు సిరప్ తాగి పిల్లలు చనిపోయారనే నివేదికలు వెలువడటంతో నోయిడాకు చెందిన ఫార్మా మారియన్ బయోటెక్ క్లౌడ్ కిందకు వచ్చింది. డబ్ల్యూహెచ్వో ప్రకారం.. ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాతీయ నాణ్యత నియంత్రణ ప్రయోగశాలలు నిర్వహించిన నాణ్య పరీక్షల్లో రెండు ఉత్పత్తుల్లో ఆమోదయోగ్యం కాని మొత్తంలో డైథైలీన్ గ్లైకాల్ లేదా ఇథిలీన్ గ్లైకాల్ కలుషితాలు ఉన్నట్లు కనుగొనబడింది.
Also Read
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
- FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
ఈ రెండు ఉత్పత్తులకు ఈ ప్రాంతంలోని ఇతర దేశాలలో మార్కెటింగ్ అధికారాలు ఉండవచ్చు. అవి అనధికారిక మార్కెట్ల ద్వారా ఇతర దేశాలు లేదా ప్రాంతాలకు కూడా పంపిణీ చేయబడి ఉండవచ్చు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. నాసిరకం ఉత్పత్తులు సురక్షితం కాదని.. వాటి ఉపయోగం, ముఖ్యంగా పిల్లలలో, తీవ్రమైన గాయం లేదా మరణానికి దారితీయవచ్చని డబ్ల్యూహెచ్వో హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబరు 22న ఉజ్బెకిస్థాన్లో మారియన్ బయోటెక్ కంపెనీ తయారుచేసిన మందులు తాగి 18 మంది పిల్లలు చనిపోయారని ఆరోపించింది. ఉజ్బెకిస్థాన్లో 18 మంది చిన్నారుల మరణానికి కారణమైన మారియన్ బయోటెక్ కంపెనీ ఉత్పత్తి లైసెన్స్ను ఉత్తరప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మంగళవారం సస్పెండ్ చేసింది.
Vande Bharath : తెలుగు ప్రజలకు కేంద్రం సంక్రాంతి కానుక
తగిన పత్రాలు అందించనందున మారియన్ బయోటెక్ కంపెనీ ఉత్పత్తి లైసెన్స్ను సస్పెండ్ చేశామని గౌతమ్బుద్ధ్ నగర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వైభవ్ బబ్బర్ తెలిపారు. వారు తనిఖీ సమయంలో అడిగిన పత్రాలను అందించకపోవడంతో రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ షో-కాజ్ నోటీసు కూడా ఇచ్చిందన్నారు. నమూనా ఫలితాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని ఆయన అన్నారు. దగ్గు సిరప్ డాక్1 మ్యాక్స్ కలుషితమైందన్న నివేదికల దృష్ట్యా నోయిడాకు చెందిన ఫార్మా కంపెనీ తయారీ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గత నెలలో తెలిపారు.
తాజావార్తలు
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
-
RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?