Cough Syrups: ఉజ్బెకిస్తాన్లో ఈ భారతీయ దగ్గు సిరప్లను ఉపయోగించొద్దు.. డబ్ల్యూహెచ్వో సిఫార్సు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cough Syrups: నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్లను ఉజ్బెకిస్థాన్లోని పిల్లలకు ఉపయోగించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేసింది. మారియన్ బయోటెక్ తయారు చేసిన వైద్య ఉత్పత్తులు నాణ్యతా ప్రమాణాలు అందుకోవడంలో విఫలమయ్యాయని.. అందువల్లే వాటిని ఉపయోగించొద్దని బుధవారం డబ్ల్యూహెచ్వో ఓ హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన వెబ్సైట్లో పేర్కొంది.
ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన రెండు సిరప్లు ఆంబ్రోనాల్(AMBRONOL), డాక్-1 మాక్స్(DOK-1) సిరప్ల తయారీ నాణ్యత ప్రమాణాలు పాటించలేదని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. దగ్గు సిరప్ తాగి పిల్లలు చనిపోయారనే నివేదికలు వెలువడటంతో నోయిడాకు చెందిన ఫార్మా మారియన్ బయోటెక్ క్లౌడ్ కిందకు వచ్చింది. డబ్ల్యూహెచ్వో ప్రకారం.. ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాతీయ నాణ్యత నియంత్రణ ప్రయోగశాలలు నిర్వహించిన నాణ్య పరీక్షల్లో రెండు ఉత్పత్తుల్లో ఆమోదయోగ్యం కాని మొత్తంలో డైథైలీన్ గ్లైకాల్ లేదా ఇథిలీన్ గ్లైకాల్ కలుషితాలు ఉన్నట్లు కనుగొనబడింది.
Also Read
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
- Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
- IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
- Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
ఈ రెండు ఉత్పత్తులకు ఈ ప్రాంతంలోని ఇతర దేశాలలో మార్కెటింగ్ అధికారాలు ఉండవచ్చు. అవి అనధికారిక మార్కెట్ల ద్వారా ఇతర దేశాలు లేదా ప్రాంతాలకు కూడా పంపిణీ చేయబడి ఉండవచ్చు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. నాసిరకం ఉత్పత్తులు సురక్షితం కాదని.. వాటి ఉపయోగం, ముఖ్యంగా పిల్లలలో, తీవ్రమైన గాయం లేదా మరణానికి దారితీయవచ్చని డబ్ల్యూహెచ్వో హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబరు 22న ఉజ్బెకిస్థాన్లో మారియన్ బయోటెక్ కంపెనీ తయారుచేసిన మందులు తాగి 18 మంది పిల్లలు చనిపోయారని ఆరోపించింది. ఉజ్బెకిస్థాన్లో 18 మంది చిన్నారుల మరణానికి కారణమైన మారియన్ బయోటెక్ కంపెనీ ఉత్పత్తి లైసెన్స్ను ఉత్తరప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మంగళవారం సస్పెండ్ చేసింది.
Vande Bharath : తెలుగు ప్రజలకు కేంద్రం సంక్రాంతి కానుక
తగిన పత్రాలు అందించనందున మారియన్ బయోటెక్ కంపెనీ ఉత్పత్తి లైసెన్స్ను సస్పెండ్ చేశామని గౌతమ్బుద్ధ్ నగర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వైభవ్ బబ్బర్ తెలిపారు. వారు తనిఖీ సమయంలో అడిగిన పత్రాలను అందించకపోవడంతో రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ షో-కాజ్ నోటీసు కూడా ఇచ్చిందన్నారు. నమూనా ఫలితాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని ఆయన అన్నారు. దగ్గు సిరప్ డాక్1 మ్యాక్స్ కలుషితమైందన్న నివేదికల దృష్ట్యా నోయిడాకు చెందిన ఫార్మా కంపెనీ తయారీ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గత నెలలో తెలిపారు.
తాజావార్తలు
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
-
IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
-
Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
-
Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!