1. నేడు క్రిస్మస్ను పురస్కరించుకొని వేడుకలకు ముస్తాబైన ప్రార్థన మందిరాలు.
2 . నేడు హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,850లు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,380 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.74,000 లుగా ఉంది.
3. నేడు నెల్లూరు జిల్లాలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. నెల్లూరులో ప్రధాన చర్చిలలో క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొంటారు.
4. నెల్లూరులోని పార్టీ నేతలతో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సమావేశం.
5. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన సందర్భంగా నెల్లూరు నగరంలోని విఆర్సి కళాశాల మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించనున్న ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి..
6. నెల్లూరు రూరల్ పరిధిలోని శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం సమీపంలోని ఫంక్షన్ హాల్ లో వైసీపీ నేతలు.. కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
7. కొనసాగుతున్న సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటన. నేడు పులివెందుల సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గోనున్న సీఎం. ప్రార్థనల అనంతరం హెలీకాప్టర్లో కడప విమానాశ్రయం చేరుకుంటారు.
కడప ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళతారు.
8. ప్రకాశం జిల్లాలో నేడు పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యక్రమాలు. కడపలో పలు కార్యక్రమాల్లో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొంటారు.