Weather Update : భారీగా పెరిగిన చలి.. ఈ రాష్ట్రాల్లో 10మందికి పైగా మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Update : ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో విపరీతమైన చలి ఉంటుంది. ఢిల్లీ, యూపీ, బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7.8 డిగ్రీలుగా నమోదైంది. దాదాపు 23 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలి పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో గాలి నాణ్యత పేలవంగా ఉంది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో AQI స్థాయి దాదాపు 300కి చేరుకుంది. హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లోని అనేక ప్రాంతాలలో మంచు కురుస్తోంది. తమిళనాడులో వర్షాల కారణంగా 10 మంది చనిపోయారు. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, కేదార్నాథ్, పితోర్ఘర్, ఔలి వంటి ఎత్తైన ప్రదేశాలలో మంచు కురిసిన తర్వాత, అనేక మైదానాల్లో చలిగాలులు వీస్తున్నాయి. మంగళవారం నైనిటాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్ కాగా, ముస్సోరీలో 5 డిగ్రీలకు పడిపోయింది.
Read Also:Lord Ganesh: మీ దోషాలు, విఘ్నాలు తొలగిపోవాలంటే ఈ స్తోత్ర పారాయణం చేయండి
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
వచ్చే ఐదు రోజుల పాటు పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో చాలా దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రాష్ట్రాల్లోనూ చలి విపరీతంగా ఉంది. జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా గుల్మార్గ్ నగరంలో తాజాగా మంచు కురుస్తోంది. ఈ జిల్లాలో చిక్కుకుపోయిన 61 మంది పర్యాటకులను భారత సైన్యం రక్షించింది. అదే సమయంలో గత కొన్ని రోజులుగా దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా తమిళనాడులో అత్యధికంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా తిరునల్వేలి, టుటికోరిన్ జిల్లాల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పిడుగుపాటుకు కొందరు, గోడ కూలి మరికొందరు చనిపోయారు. కుండపోత వర్షాల కారణంగా రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తమైంది.
Read Also:Telangana Assembly: ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
వర్ష హెచ్చరిక జారీ
తమిళనాడులోని పలు జిల్లాల్లో సహాయక చర్యల కోసం ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. 30 గంటల్లో కాయల్పట్టినంలో 1186 మిల్లీమీటర్లు, తిరుచెందూర్లో 921 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని స్థానిక అధికారి తెలిపారు. గత కొన్ని రోజులుగా కేరళలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు రోజుల పాటు కేరళలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కేరళలోని పతనంతిట్ట, కొల్లం, తిరువనంతపురంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!