Wankhede Stadium Honors: ముంబైలో భారీ వేడుక.. శాస్త్రి స్టాండ్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ కు ఫెలిసిటేషన్..!

Wankhede Stadium

Wankhede Stadium

Wankhede Stadium Honors: ముంబైలోని ప్రముఖ వాంఖడే స్టేడియం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా మారబోతోంది. భారత మాజీ క్రికెటర్ రవి శాస్త్రికు గౌరవంగా స్టేడియంలో ఒక స్టాండ్‌కు ఆయన పేరు పెట్టనున్నారు. ఏప్రిల్ 8న జరగనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో మరో భారత స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా పాల్గొననుండటం ఈ వేడుకకు మరింత ప్రాధాన్యతను తీసుకువచ్చింది.

ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమంలో ప్రెస్ బాక్స్ కింద ఉన్న లెవెల్-1 స్టాండ్‌ను “రవి శాస్త్రి స్టాండ్”గా అధికారికంగా నామకరణం చేయనున్నారు. ఆటగాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా భారత క్రికెట్‌కు శాస్త్రి చేసిన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందిస్తున్నారు. ఇదే కార్యక్రమంలో సూర్యకుమార్ యాదవ్‌కు ప్రత్యేక సన్మానం కూడా జరగనుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చేతుల మీదుగా ఆయనను సత్కరించనున్నట్లు సమాచారం.

Varanasi: వారణాసి కథ ఇదేనా? గూస్‌బంప్స్ గ్యారెంటీ..

2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్‌గా ఆయన సేవలకు గాను ఈ గౌరవం లభిస్తోంది. న్యూజిలాండ్‌ పై జరిగిన ఫైనల్‌ లో భారత జట్టు ఏకపక్ష విజయం సాధించి వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ ను గెలుచుకుంది. బ్యాటింగ్‌ లో కొంతకాలం ఫామ్లో లేకపోయినా, కెప్టెన్‌గా సూర్యకుమార్ ప్రదర్శనకు అభిమానులు, నిపుణుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి.

ఇక రవిశాస్త్రి విషయానికి వస్తే.. ఆయన భారత్ తరఫున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడటంతో పాటు కోచ్‌గా ఉన్న సమయంలో భారత టెస్ట్ క్రికెట్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో సాధించిన చారిత్రాత్మక సిరీస్ విజయాలు ఆయన కెరీర్‌లో కీలక ఘట్టాలు. ఈ కార్యక్రమంలో ఇతర ముంబై క్రికెట్ దిగ్గజాలను కూడా MCA గౌరవించనుంది. గేట్ నంబర్ 3కు దిలీప్ సర్దేసాయి, గేట్ నంబర్ 5కు డయానా ఎడుల్జీ, గేట్ నంబర్ 6కు ఏక్నాథ్ సోల్కర్ పేర్లు పెట్టనున్నారు. గతంలో ఇదే స్టేడియంలో రోహిత్ శర్మను కూడా MCA సత్కరించిన విషయం తెలిసిందే.

Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

ఇదిలా ఉండగా ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు మాత్రం ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓటములు చవిచూసి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది. తాజాగా గువాహటిలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం చవిచూసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ ను 11 ఓవర్లకు కుదించగా.. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడి 150/3 భారీ స్కోర్ నమోదు చేశారు. ప్రతిగా ముంబై ఇండియన్స్ 123/9కే పరిమితమైంది.