ప్రముఖ టెలికాం కంపెనీ ‘వొడాఫోన్ ఐడియా’ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ ఉన్న నేపథ్యంలో వినియోగదారులకు ఆ సేవల్ని అందించడానికి కొత్త ప్లాన్ను విడుదల చేసింది. ఆ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రూ.169. వొడాఫోన్ ఐడియా అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త ప్లాన్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
Also Read: Bengaluru Water Crisis: బెంగళూరులో నీటి సంక్షోబానికి కారణం ఏంటో తెలుసా?
వొడాఫోన్ ఐడియా కొత్తగా తీసుకొచ్చిన రూ.169 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. ఈ ప్లాన్లో అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు ఉండవు. ఈ ప్లాన్లో మొత్తం 8జీబీ డేటా లభిస్తుంది. డేటాపై రోజువారీ పరిమితి లేదు. కావాలంటే వినియోగదారులు డేటాను ఒకరోజులోనే ఉపయోగించవచ్చు. ఈ రీఛార్జితో మూడు నెలల పాటు డిస్నీ ప్లస్ హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ను అందిస్తోంది. అదనపు డేటా, ఓటీటీ బెన్ఫిట్స్ కావాలనుకునే వారు ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.