Gas Cylinder Robbery: గ్యాస్ సిలిండర్లతో డెలివరీ బాయ్ పరార్..
- ఏపీలో వింత దొంగతనం..
- గ్యాస్ సిలిండర్లతో డెలివరీ బాయ్ పరార్..
- స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఒకవైపు, స్థానిక మోసాలు మరోవైపు వెరసి సామాన్యుడి గ్యాస్ కష్టాలు రెట్టింపవుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఒక వింత సంఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గ్యాస్ సిలిండర్లతో డెలివరీ బాయ్ పరార్..
Also Read
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
- Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడుల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్పై తీవ్రంగా పడుతోంది. యుద్దం ముగుస్తోంది అని చెబుతూనే.. దాడులకు తెగబడటం గ్యాస్ మరియు ముడి చమురు ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఈ అంతర్జాతీయ పరిణామాలు సామాన్యుడి వంటగదిపై భారాన్ని పెంచుతుంటే.. క్షేత్రస్థాయిలో డెలివరీ బాయ్స్ చేసే మోసాలు వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి.
విశాఖపట్నం గంట్యాడలోని ఒక గ్యాస్ ఏజెన్సీలో అప్పారావు అనే వ్యక్తి డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. వరుసగా ఎండలు ముదురుతున్న వేళ, గ్యాస్ కష్టాలు కూడా తోడయ్యాయి. ఈ క్రమంలో అప్పారావు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేయకుండానే, వినియోగదారుల వద్దకు వెళ్లి ఏదో సాకు చెప్పి ముందే OTP (One Time Password) తీసుకున్నాడు. ఇలా సుమారు 30 మంది కస్టమర్ల నుంచి ఓటీపీలు సేకరించి, ఆ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నాడో లేదా తనతో పాటే పట్టుకుపోయాడో తెలియదు కానీ.. ఏకంగా 30 సిలిండర్లతో అదృశ్యమయ్యాడు.
చాలాసేపటికీ సిలిండర్లు రాకపోవడం, అప్పటికే డెలివరీ సక్సెస్ అయినట్లు మెసేజ్లు రావడంతో కస్టమర్లు ఏజెన్సీని నిలదీశారు. తీరా చూస్తే అప్పారావు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు. దీంతో గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్ల సబ్సిడీ తగ్గి, సిలిండర్ ధర సామాన్యుడికి భారంగా మారింది. ఇటువంటి సమయంలో డెలివరీ బాయ్స్ ఓటీపీల పేరుతో మోసం చేయడం విచారకరం.
డెలివరీ బాయ్స్ను నమ్మి ఓటీపీలు ఇవ్వడం వల్ల ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. సిలిండర్ చేతికి అందిన తర్వాతే ఓటీపీ చెప్పాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. యుద్ధాల వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందులను తట్టుకోవడం ఒక ఎత్తైతే, ఇలాంటి స్థానిక దొంగతనాల వల్ల కలిగే నష్టం మరొకటి. అప్పారావు ఉదంతం గ్యాస్ వినియోగదారులందరికీ ఒక గుణపాఠంగా మారింది.
తాజావార్తలు
-
Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!