NTV Telugu Site icon

Gangs Of Godavari : మరి కొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ..

Viswaksen

Viswaksen

Gangs Of Godavari : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ అఫ్ గోదావరి “..ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య ఈ సినిమాను తెరకెక్కించారు.విశ్వక్ సేన్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది.ఈ సినిమాను సితార ఎంటెర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మాత నాగ వంశీ,సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమా మే 31 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే మంచి ఓపెంనింగ్స్ దక్కాయి.

Read Also :Harom Hara : హరోంహర మూవీ టీం బంపర్ ఆఫర్.. రెండు టికెట్స్ కొంటే ఒక టికెట్ ఫ్రీ.. ఎలా అంటే..?

ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ.8.2 కోట్లు వసూలు చేసి దుమ్ము రేపింది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లంకల రత్న పాత్రలో తన మాస్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయిన 15 రోజుల్లలోనే ఓటిటిలోకి వస్తుండటంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.ఈ మూవీని జూన్ 14 న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.రేపు ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఓటిటిలోకి స్ట్రీమింగ్ కానుంది.మరి కొన్ని గంటల్లో అనగా ఈ అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటిటి లోకి అడుగుపెట్టబోతుంది.ఈ సినిమాకోసం ఓటిటి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ మూవీ ఓటిటి ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.