టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. తాజాగా కేవీ అనుదీప్ డైరెక్షన్ లో వచ్చిన ఫంకీ డిజాస్టర్ గా నిలిచింది. మరోవైపు వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు విశ్వక్. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీతో ‘దేవ్ వంటి డిజాస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రజత్ రవిశంకర్, ఇప్పుడు విశ్వక్ సేన్తో తన తర్వాతి సినిమాను చేయబోతున్నారు. ‘దేవ్’ ఆశించిన విజయం సాధించకపోవడంతో దాదాపు ఏడేళ్ల విరామం తీసుకున్న రజత్, ఇప్పుడు పక్కా స్క్రిప్ట్తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
Also Read : Vishal : నటుడు విశాల్కు మద్రాస్ హైకోర్టులో బిగ్ షాక్.. ఆ డబ్బు తిరిగి కట్టాల్సిందే.. లేదంటే జైలుకే
ఈ భారీ చిత్రాన్ని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ దేవర వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన యువ సుధా ఆర్ట్స్ బ్యానర్పై సుధాకర్ మిక్కిలినేని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో ‘దేవర2 మరియు ఇతర పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, విశ్వక్ సేన్ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా పట్టాలెక్కిస్తోంది. ఇది విశ్వక్ సేన్ కెరీర్లో ఒక విభిన్నమైన జోనర్ మూవీగా ఉండబోతుందని సమాచారం. విశ్వక్ సేన్ ప్రస్తుతం లెగసీ, ఫంకీ వంటి విభిన్న చిత్రాలతో పాటు తన సొంత దర్శకత్వంలోనూ సినిమాలు చేస్తున్నారు. రజత్ రవిశంకర్ దర్శకత్వంలో చేయబోయే ఈ చిత్రం స్టైలిష్గా ఉంటూనే మాస్ ఆడియన్స్కు నచ్చే అంశాలతో ఉండబోతుందని తెలుస్తోంది. ఏడేళ్ల తర్వాత రజత్ చేస్తున్న సినిమా కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట రజత్. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు ఇతర నటీనటుల సమాచారాన్ని మేకర్స్ వెల్లడించనున్నారు.
