టాలీవుడ్ సెన్సేషనల్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు రాజస్థాన్లోని ఉదయ్పుర్లో అట్టహాసంగా జరుగుతున్నాయి. ‘విరోష్’ పెళ్లికి సంబంధించి ప్రతి అప్డేట్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, తాజాగా జరిగిన సంగీత్ వేడుకలో ఒక ఆసక్తికరమైన, భావోద్వేగపూరితమైన సంఘటన చోటుచేసుకుంది. తన కాబోయే కోడలు రష్మికను కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ విజయ్ తల్లి మాధవి దేవరకొండ ఒక అపురూపమైన కానుకను అందజేశారు.
Also Read : Varanasi : ఇండియన్ సినిమా డెఫినిషన్ మార్చే సినిమా ఇది.. మహేష్-రాజమౌళి ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా ప్రశంసలు!
ఉదయ్పుర్లోని ఐటీసీ మెమెంటోస్ (ITC Mementos) హోటల్లో గ్రాండ్గా జరిగిన సంగీత్ ఈవెంట్లో, విజయ్ తల్లి మాధవి తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న బంగారు గాజులను రష్మికకు బహుమతిగా ఇచ్చారు. తరతరాలుగా తమ కుటుంబంలో పెద్దల నుంచి వస్తున్న ఈ గాజులను కోడలికి అందించడం ద్వారా, రష్మికను తమ ఇంటి మనిషిగా గౌరవిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. అత్తగారి నుంచి అందిన ఈ అపురూప కానుకను చూసి రష్మిక ఎమోషనల్ అయ్యారని, అక్కడ ఒక్కసారిగా అందమైన కుటుంబ వాతావరణం నెలకొందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఈ వివాహ వేడుకల్లో భాగంగా అంతకుముందు సరదాగా ‘విరోష్ ప్రీమియర్ లీగ్’ (VPL) పేరుతో క్రికెట్ మ్యాచ్ను నిర్వహించారు. ఇందులో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తరపు బంధువులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే విజయ్ దేవరకొండ పూల్ వాలీబాల్ ఆడుతున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలకు దర్శకుడు తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, రాహుల్ రవీంద్రన్ వంటి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. రేపు (ఫిబ్రవరి 26న) తెలుగు, కొడవ (రష్మిక కుటుంబ సంప్రదాయం) పద్ధతుల్లో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది.
