Virat Kohli: 13 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీ ఆడనున్న కింగ్ కోహ్లీ!
- రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమైన విరాట్ కోహ్లీ.
- 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం.
- కోహ్లీతో పాటు రంజీ ట్రోఫీలో ఆడనున్న మరికొంతమంది టీమిండియా ఆటగాళ్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. రైల్వేస్తో ఢిల్లీ ఆడనున్న చివరి గ్రూప్ మ్యాచ్కు తాను అందుబాటులో ఉన్నట్లు కోహ్లీ ప్రకటించాడు. జనవరి 30న రైల్వేస్తో ఢిల్లీ తలపడనుంది. ఇది ఇలా ఉండగా.. కోహ్లీ చివరిసారిగా 2012లో ఉత్తరప్రదేశ్తో ఘజియాబాద్లో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీ ఢిల్లీకి మరోమారు ఆడబోతున్నాడు. 36 ఏళ్ల కోహ్లీ మెడ నొప్పి కారణంగా జనవరి 23 నుంచి సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్లో ఆడలేడని బీసీసీఐ వైద్య బృందానికి తెలిపాడు. అయితే, ఓ నివేదిక ప్రకారం అతను జనవరి 30 నుండి జరగనున్న ఢిల్లీ తదుపరి మ్యాచ్కు తన లభ్యత గురించి DDCA (ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్)కి తెలియజేశాడు.
Also Read: Ravi Abburi: నేను ఇక ఆపేస్తా.. చాలు.. టాలీవుడ్ రచయిత సంచలనం!
Also Read
- రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
- AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామాలు.. అప్రూవర్ పిటిషన్కు ఓకే.. కారుమూరికి పీటీ వారెంట్..
- సూపర్ఫాస్ట్ ఛార్జింగ్, హెల్త్ ట్రాకింగ్లో బిగ్ అప్గ్రేడ్, ఏఐ ఫీచర్లతో Apple Watch Series 12 విడుదల..
- Apple Watch Ultra 4 లాంచ్.. ఆరోగ్యానికి రక్షణ కవచం.. ప్రతి 5 సెకన్లకు హార్ట్రేట్ మానిటరింగ్.. బిగ్ బ్యాటరీ లైఫ్
Virat Kohli is set to play in the Ranji Trophy for the first time in 13 years! He has confirmed availability to play for Delhi against Railways in the final round starting January 30 pic.twitter.com/hyhcbQtN8u
— ESPNcricinfo (@ESPNcricinfo) January 20, 2025
ఢిల్లీ తరఫున కోహ్లీ 23 మ్యాచ్ల్లో పాల్గొని 50.77 సగటుతో 1574 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో ఢిల్లీకి ఆడుతున్న సమయంలో కోహ్లీ 5 సెంచరీలు చేశాడు. 2009-10 సీజన్లో కోహ్లీ 3 మ్యాచ్ల్లో 93.50 సగటుతో 374 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. జాతీయ జట్టులో కోహ్లి సహచరుడు రిషబ్ పంత్ కూడా 6 సంవత్సరాల తర్వాత రాజ్కోట్లో మైదానంలో రంజీ ట్రోఫీ కోసం అడుగు పెట్టనున్నాడు. మరోవైపు జమ్మూకశ్మీర్తో ముంబై ఆడే మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆడనున్నాడు. రంజీ ట్రోఫీ తదుపరి రౌండ్లో శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజాలతో సహా ఇతర టీమిండియా క్రికెటర్లు కూడా తమ జట్లలో భాగం కానున్నారు. చూడాలి మరి రంజీ ట్రోఫీలో ఎంతమంది సీనియర్ ఆటగాళ్లు తిరిగి ఫామ్ అందుకుంటారో.
తాజావార్తలు
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
UIDAI Aadhaar Face Authentication: ఆధార్ వెరిఫికేషన్లో భారీ మార్పులు.. UIDAI తీసుకొచ్చిన కొత్త టూల్ ఇదే
-
AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామాలు.. అప్రూవర్ పిటిషన్కు ఓకే.. కారుమూరికి పీటీ వారెంట్..
-
సూపర్ఫాస్ట్ ఛార్జింగ్, హెల్త్ ట్రాకింగ్లో బిగ్ అప్గ్రేడ్, ఏఐ ఫీచర్లతో Apple Watch Series 12 విడుదల..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!