Virat Kohli: 13 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీ ఆడనున్న కింగ్ కోహ్లీ!
- రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమైన విరాట్ కోహ్లీ.
- 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం.
- కోహ్లీతో పాటు రంజీ ట్రోఫీలో ఆడనున్న మరికొంతమంది టీమిండియా ఆటగాళ్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. రైల్వేస్తో ఢిల్లీ ఆడనున్న చివరి గ్రూప్ మ్యాచ్కు తాను అందుబాటులో ఉన్నట్లు కోహ్లీ ప్రకటించాడు. జనవరి 30న రైల్వేస్తో ఢిల్లీ తలపడనుంది. ఇది ఇలా ఉండగా.. కోహ్లీ చివరిసారిగా 2012లో ఉత్తరప్రదేశ్తో ఘజియాబాద్లో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీ ఢిల్లీకి మరోమారు ఆడబోతున్నాడు. 36 ఏళ్ల కోహ్లీ మెడ నొప్పి కారణంగా జనవరి 23 నుంచి సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్లో ఆడలేడని బీసీసీఐ వైద్య బృందానికి తెలిపాడు. అయితే, ఓ నివేదిక ప్రకారం అతను జనవరి 30 నుండి జరగనున్న ఢిల్లీ తదుపరి మ్యాచ్కు తన లభ్యత గురించి DDCA (ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్)కి తెలియజేశాడు.
Also Read: Ravi Abburi: నేను ఇక ఆపేస్తా.. చాలు.. టాలీవుడ్ రచయిత సంచలనం!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
Virat Kohli is set to play in the Ranji Trophy for the first time in 13 years! He has confirmed availability to play for Delhi against Railways in the final round starting January 30 pic.twitter.com/hyhcbQtN8u
— ESPNcricinfo (@ESPNcricinfo) January 20, 2025
ఢిల్లీ తరఫున కోహ్లీ 23 మ్యాచ్ల్లో పాల్గొని 50.77 సగటుతో 1574 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో ఢిల్లీకి ఆడుతున్న సమయంలో కోహ్లీ 5 సెంచరీలు చేశాడు. 2009-10 సీజన్లో కోహ్లీ 3 మ్యాచ్ల్లో 93.50 సగటుతో 374 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. జాతీయ జట్టులో కోహ్లి సహచరుడు రిషబ్ పంత్ కూడా 6 సంవత్సరాల తర్వాత రాజ్కోట్లో మైదానంలో రంజీ ట్రోఫీ కోసం అడుగు పెట్టనున్నాడు. మరోవైపు జమ్మూకశ్మీర్తో ముంబై ఆడే మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆడనున్నాడు. రంజీ ట్రోఫీ తదుపరి రౌండ్లో శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజాలతో సహా ఇతర టీమిండియా క్రికెటర్లు కూడా తమ జట్లలో భాగం కానున్నారు. చూడాలి మరి రంజీ ట్రోఫీలో ఎంతమంది సీనియర్ ఆటగాళ్లు తిరిగి ఫామ్ అందుకుంటారో.
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!