Himachal Pradesh Cabinet: హిమాచల్ కేబినెట్ విస్తరణ.. విక్రమాదిత్య సింగ్ సహా 7గురు ప్రమాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal Pradesh Cabinet: హిమాచల్ ప్రదేశ్లో ఆదివారం ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సమక్షంలో మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్తో సహా మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సిమ్లా గ్రామీణ శాసనసభ్యుడు విక్రమాదిత్య సింగ్తో పాటు షిల్లై ఎమ్మెల్యే హర్షవర్ధన్ చౌహాన్, కిన్నౌర్ ఎమ్మెల్యే జగత్ సింగ్ నేగి, మాజీ ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శి, జుబ్బల్ కోట్ఖాయ్ ఎమ్మెల్యే రోహిత్ ఠాకూర్, సోలన్ ఎమ్మెల్యే ధనిరామ్ షాండిల్, జవాలి శాసనసభ్యుడు చంద్ర కుమార్, అనిరుధ్ సింగ్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కొత్తగా చేరిన మంత్రులతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రితో సహా మంత్రుల సంఖ్య గరిష్టంగా 12 మందికి మించకుండా డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు మూడు బెర్త్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సుఖు, ఉపముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి డిసెంబర్ 11న ప్రమాణ స్వీకారం చేశారు. శీతాకాల సమావేశాల సమయంలో ఢిల్లీకి వెళ్లిన సుఖు గత మూడు రోజులుగా పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, హిమాచల్ వ్యవహారాల పార్టీ ఇన్ఛార్జ్ రాజీవ్ శుక్లా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్లతో సంప్రదింపులు జరిగినట్లు సమాచారం.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Delhi Police: ఢిల్లీ యువతి కేసు.. పోలీసుల కీలక నిర్ణయం
కేబినెట్ ఏర్పాటులో జాప్యం అధికార కాంగ్రెస్కు పెద్ద ఇబ్బందిగా మారింది. పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తాయి. 68 మంది సభ్యులున్న సభలో కాంగ్రెస్కు మొత్తం 40 మంది శాసనసభ్యులు ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు 24 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉన్న సుఖు తన విధేయులకు మంత్రివర్గంలో ఎక్కువ వాటాను కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా, నాయకత్వానికి హక్కు కల్పించిన రాష్ట్ర పార్టీ చీఫ్ ప్రతిభా సింగ్ కూడా ప్రభుత్వంలో న్యాయమైన ప్రాతినిధ్యం కోరుతున్నారు. సుఖు ఇప్పటికే కేబినెట్ హోదాతో ప్రభుత్వంలో తన విధేయులను నియమించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!